News July 29, 2024
ఆప్ ప్రభుత్వాల అభివృద్ధి చూసి మోదీకి అసూయ: సునీతా కేజ్రీవాల్

తప్పుడు కేసులో తన భర్తను జైలుకు పంపినందుకు ఓటు రూపంలో ప్రతీకారం తీర్చుకోవాలని ఢిల్లీ CM కేజ్రీవాల్ సతీమణి సునీత పిలుపునిచ్చారు. హరియాణాలో మాట్లాడుతూ.. ‘ఢిల్లీ, పంజాబ్లలో ఆప్ ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధిని చూసి మోదీ అసూయ పడుతున్నారు. పెద్ద పార్టీలు, నాయకులు చేయని గొప్ప పనులను కేజ్రీవాల్ చేశారు. స్కూళ్లు, ఆస్పత్రులను సమూలంగా మార్చారు. దీన్ని చూసి ఓర్వలేకే ఆయన్ను జైలుకు పంపారు’ అని మండిపడ్డారు.
Similar News
News November 5, 2025
ఇండియన్ బ్యాంక్లో ఉద్యోగాలు

<
News November 5, 2025
వరి కోత అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తలు

వరిని నూర్చేటప్పుడు వేర్వేరు రకాల ధాన్యం కలవకుండా జాగ్రత్త పడాలి. నూర్చిన ధాన్యాన్ని శుభ్రంగా తూర్పారబోసి చెత్త, తాలు, మట్టి బెడ్డలను ఏరేయాలి. చౌడు నేలల్లో పండించిన ధాన్యాన్ని, చీడపీడలు ఆశించి రంగు మారిన ధాన్యాన్ని మంచి ధాన్యంతో కలపకూడదు. తూర్పార బెట్టిన ధాన్యంలో మట్టి గడ్డలు, గడ్డి, కలుపు విత్తనాలు, మొక్కల అవశేషాలు లేకుండా చూడాలి. ఇలా శుభ్రం చేసిన ధాన్యం ఎక్కువ కాలం నిల్వ ఉండి మంచి ధర వస్తుంది.
News November 5, 2025
‘ఇద్దరు పిల్లల’ నిబంధన ఎత్తివేత.. నేడు ఉత్తర్వులు

TG: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ‘ఇద్దరు పిల్లల’ నిబంధనను ఎత్తివేసే ఆర్డినెన్స్కు గవర్నర్ జిష్ణుదేశ్ ఆమోదం తెలిపారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు ఇవ్వనుంది. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే పోటీకి అనర్హులుగా పేర్కొంటూ చేసిన చట్టం 1995 నుంచి అమల్లో ఉంది. తాజా నిర్ణయంతో పంచాయతీ, MPTC, ZPTC, పురపాలక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారూ పోటీ చేసేందుకు వీలు కలుగుతుంది.


