News July 29, 2024
ఆప్ ప్రభుత్వాల అభివృద్ధి చూసి మోదీకి అసూయ: సునీతా కేజ్రీవాల్

తప్పుడు కేసులో తన భర్తను జైలుకు పంపినందుకు ఓటు రూపంలో ప్రతీకారం తీర్చుకోవాలని ఢిల్లీ CM కేజ్రీవాల్ సతీమణి సునీత పిలుపునిచ్చారు. హరియాణాలో మాట్లాడుతూ.. ‘ఢిల్లీ, పంజాబ్లలో ఆప్ ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధిని చూసి మోదీ అసూయ పడుతున్నారు. పెద్ద పార్టీలు, నాయకులు చేయని గొప్ప పనులను కేజ్రీవాల్ చేశారు. స్కూళ్లు, ఆస్పత్రులను సమూలంగా మార్చారు. దీన్ని చూసి ఓర్వలేకే ఆయన్ను జైలుకు పంపారు’ అని మండిపడ్డారు.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


