News October 16, 2025

శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్న నాలుగో ప్రధాని మోదీ

image

AP: ప్రధాని మోదీ ఇవాళ శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్నారు. గతంలో ఆ హోదాలో జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇప్పుడు నాలుగో ప్రధానిగా మోదీ వస్తున్నారు. భారత వాయుసేన విమానంలో ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9.55 గంటలకు కర్నూలు, అక్కడి నుంచి సైనిక హెలికాప్టర్‌లో శ్రీశైలం వెళ్తారు. అటు మోదీకి స్వాగతం పలికేందుకు కర్నూలు నగరం ముస్తాబైంది.

Similar News

News October 16, 2025

‘మిత్ర మండలి’ రివ్యూ&రేటింగ్

image

తండ్రి కులాంతర పెళ్లికి ఒప్పుకోడని హీరోయిన్ (నిహారిక) ఇంటి నుంచి పారిపోవడం, దీంతో ఆమె ఫ్రెండ్స్ పడిన ఇబ్బందులే స్టోరీ. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణుల కామెడీ అక్కడక్కడా మినహా చాలాచోట్ల రుద్దినట్లు అనిపిస్తుంది. సత్య యాక్టింగ్ రిలీఫ్ ఇస్తుంది. బ్రహ్మానందం ఓ పాటలో మెరిశారు. నవ్వించాలనే సెటప్ చేసుకున్నా డైరెక్టర్ విజయేందర్ సక్సెస్ కాలేదు. కథ, స్క్రీన్‌ప్లే, సాంగ్స్, BGM తేలిపోయాయి.
రేటింగ్: 1.75/5.

News October 16, 2025

లవకుశుల్లో ఎవరు పెద్దవారు?

image

లవకుశులు కవలలన్న విషయం మనకు తెలిసిందే. ఈ జంట పదాల్లో లవుడి పేరు ముందుండటం వల్ల లవుడు పెద్దవాడని అనుకుంటారు. కానీ అనేక పురాణాలు కుశుడు పెద్దవాడని చెబుతున్నాయి. కవలల్లో ముందు జన్మించిన వారిని పెద్దవారిగా పరిగణిస్తారు. రామాయణ గాథలు కుశుడే ముందు జన్మించినట్లు పేర్కొంటున్నాయి. దీన్ని బట్టి కుశుడు పెద్దవాడని చెప్పవచ్చు. అయితే కుశుడిని, వాల్మీకీ తన మాయా శక్తితో సృష్టించాడన్న కథనాలు కూడా ఉన్నాయి.

News October 16, 2025

పంచదారతో పసిడి చర్మం

image

అందంగా కనిపించాలని కోరుకోని వారుండరు. అలాగని రోజూ ఖరీదైన క్రీములు వాడి చర్మ సంరక్షణ చేయడం అందరికీ సాధ్యం కాదు. అలాంటివారు ఇంట్లోనే సులువుగా దొరికే పంచదారతో చిటికెలో మెరిసిపోవచ్చు. * గులాబీ రేకుల్ని ముద్దగా చేసి, దానికి చెంచా చొప్పున తేనె, పంచదార కలిపి ముఖానికి పూత వేయండి. అలా ఓ నలభై నిమిషాలు ఆరనిచ్చి చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తే ముఖం కాంతులీనుతుంది.