News February 3, 2025
పారిశ్రామికవేత్తలకు మోదీ, కేజ్రీ బానిసలు: ప్రియాంక
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్పై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. ‘ఇద్దరిదీ ఒకే తరహా మైండ్సెట్. పారిశ్రామిక వేత్తలకు బానిసత్వం చేస్తుంటారు. వారిలాంటి పిరికిపందల్ని నేనెప్పుడూ చూడలేదు. అభివృద్ధి జరగకపోవడానికి నెహ్రూ కారణమని మోదీ ఆరోపిస్తుంటారు. అటు కేజ్రీవాల్ తన వైఫల్యాలకు మోదీ కారణమంటారు. ఆయన శీశ్మహల్ కడితే మోదీ రాజ్మహల్ కట్టారు’ అని విమర్శించారు.
Similar News
News February 3, 2025
కంకషన్ వివాదం: క్రిస్ బ్రాడ్ తీవ్ర విమర్శలు
భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్ ముగిసినా కంకషన్ వివాదం మాత్రం ఇంకా చల్లారలేదు. దూబే స్థానంలో హర్షిత్ రాణాను సబ్స్టిట్యూట్గా భారత్ ఆడించడం అన్యాయమని ICC మ్యాచ్ రిఫరీ క్రిస్ ఆరోపించారు. ‘స్వతంత్రంగా వ్యవహరించే అధికారుల్నే ICC నియమించాలి. మరి ఇప్పుడు ఏమైంది. పక్షపాతం, అవినీతితో కూడిన పాత రోజుల్లోకి ఎందుకెళ్తోంది?’ అని ప్రశ్నించారు. మ్యాచ్ రిఫరీగా ఇరు దేశాలకు చెందని అధికారి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
News February 3, 2025
తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గి రూ.84,050కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.400 తగ్గి రూ.77,050గా నమోదైంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. కేజీ వెండి ధర రూ.1,07,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.
News February 3, 2025
షాకింగ్: క్రికెటర్ల కిట్స్ను బస్సులో ఉంచి తాళమేసిన డ్రైవర్!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో దర్బార్ రాజ్షాహీ ఫ్రాంచైజీ ఆటగాళ్లకు, సిబ్బందికి డబ్బులు బకాయి పడింది. టీమ్ బస్ డ్రైవర్కైతే మొత్తం టోర్నమెంట్కు చెల్లించాల్సి ఉంది. ఎన్నిసార్లు అడిగినా యాజమాన్యం స్పందించకపోవడంతో అతడు ఆటగాళ్ల క్రికెట్ కిట్లను బస్సులోనే ఉంచి తాళమేశాడు. డబ్బులిచ్చాకే తాళం తీస్తానని తేల్చిచెప్పాడు. ఈ ఘటన క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.