News February 3, 2025
పారిశ్రామికవేత్తలకు మోదీ, కేజ్రీ బానిసలు: ప్రియాంక

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్పై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. ‘ఇద్దరిదీ ఒకే తరహా మైండ్సెట్. పారిశ్రామిక వేత్తలకు బానిసత్వం చేస్తుంటారు. వారిలాంటి పిరికిపందల్ని నేనెప్పుడూ చూడలేదు. అభివృద్ధి జరగకపోవడానికి నెహ్రూ కారణమని మోదీ ఆరోపిస్తుంటారు. అటు కేజ్రీవాల్ తన వైఫల్యాలకు మోదీ కారణమంటారు. ఆయన శీశ్మహల్ కడితే మోదీ రాజ్మహల్ కట్టారు’ అని విమర్శించారు.
Similar News
News February 3, 2026
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఉద్యోగాలు

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(<
News February 3, 2026
కోళ్లలో రక్తపారుడు.. తీవ్రమైతే మరణం తప్పదు

కోళ్లలో వైరస్, సూక్ష్మజీవుల వల్ల రక్తపారుడు వ్యాధి వస్తుంది. ఇది కూడా చిన్న కోడి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగం వస్తే కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధి బారినపడ్డ కోడి పిల్లలు ఒకేచోట గుమిగూడి రక్త విరేచనాలతో బాధపడతాయి. లక్షణాలు మరీ తీవ్రంగా మారితే కోడి పిల్లలు మరణించే అవకాశం ఉంది. వ్యాధి నివారణకు లిట్టరును పొడిగా ఉంచాలి. వెటర్నరీ నిపుణులకు తెలిపి వారి సలహాలను పాటించాలి.
News February 3, 2026
పౌర్ణమి చంద్రుడు కలలో వస్తే..?

ఇది శుభప్రదమైన సంకేతం. అలాగే చేపట్టిన పనుల్లో త్వరలోనే విజయం వరిస్తుందని సూచిస్తుంది. కుటుంబంలో ఉన్న మనస్పర్థలు తొలగి, సంబంధాలు మరింత బలపడతాయని అర్థం. జ్యోతిషశాస్త్ర రీత్యా చంద్రుడు మాతృకారకుడు. అంటే ఈ కల తల్లి ఆరోగ్యం మెరుగుపడటాన్ని, ఆమెతో అనుబంధం పెరగడాన్ని సూచిస్తుంది. విదేశీ ప్రయాణ అవకాశాలను, వైవాహిక జీవితంలో మధురమైన సుఖశాంతులను సూచిస్తుంది. ఇది రాబోయే గొప్ప సానుకూల మార్పులకు ప్రతీక.


