News September 13, 2025

ఘర్షణల తర్వాత తొలిసారి మణిపుర్‌లో అడుగుపెట్టిన మోదీ

image

ప్రధాని మోదీ మణిపుర్ చేరుకున్నారు. ఇంఫాల్‌ ఎయిర్‌పోర్టులో ఆయనకు గవర్నర్ అజయ్ భల్లా, సీఎస్ పునీత్ గోయల్ స్వాగతం పలికారు. రెండేళ్ల నుంచి మణిపుర్‌లో తీవ్ర అల్లర్లు చెలరేగుతున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్రాన్ని, ప్రధానిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ విమర్శలు కూడా చేసింది. ఈక్రమంలో ఘర్షణల తర్వాత మోదీ తొలిసారి మణిపుర్‌లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Similar News

News September 13, 2025

బీటెక్ అర్హత.. CRDAలో 132 ఉద్యోగాలు

image

ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(AP CRDA)లో 132 ఇంజినీర్ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 26 చివరి తేదీ. రాజధాని అమరావతి నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ నియామకాలు చేయనున్నారు. ఆయా విభాగాల్లో బీటెక్ పాసైన వారు అర్హులు. త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. పూర్తి వివరాల కోసం <>https://crda.ap.gov.in/<<>> వెబ్‌సైట్‌లో చూడగలరు.

News September 13, 2025

SMకు దూరంగా ఉంటా.. మరో హీరోయిన్ ప్రకటన

image

సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. ‘సోషల్ మీడియా నా పనిపై, ఆలోచనలపై దృష్టి పెట్టకుండా చేస్తోంది. నా సృజనాత్మకతను దెబ్బతీసింది. నాలోని కళాకారిణిని, నన్ను రక్షించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నా. అయినా నిజమైన సంబంధాలను ఏర్పరచుకోవడంపై దృష్టి పెడతా’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. <<17686001>>అనుష్క<<>> కూడా SMకు దూరంగా ఉంటానని ఇటీవల ప్రకటించింది.

News September 13, 2025

KTRకు రాహుల్ గురించి మాట్లాడే అర్హత ఉందా: మహేశ్

image

TG: ఫిరాయింపు MLAల విషయంలో రాహుల్‌గాంధీని KTR <<17689238>>ప్రశ్నించడంపై<<>> TPCC చీఫ్ మహేశ్‌ గౌడ్ ఫైరయ్యారు. ‘MLAలపై రాహుల్‌ ఎందుకు మాట్లాడాలి? KTR స్థాయి ఏంటి? రాహుల్ గురించి మాట్లాడే అర్హత ఉందా? కాళేశ్వరంపై విచారణను తప్పించుకోవడానికి మోదీ అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉన్నారు. BJPలో BRS విలీనం గురించి ఇప్పటికే కవిత చెప్పారు’ అని వ్యాఖ్యానించారు.