News November 19, 2024
బ్రెజిల్, చిలీ అధ్యక్షులతో మోదీ భేటీ

G20 సమ్మిట్లో బ్రెజిల్, చిలీ దేశాధ్యక్షులు లూయిస్ ఇనాసియో లూలా డా సిల్వా, గాబ్రియల్ బోరిక్లతో PM మోదీ సమావేశమయ్యారు. బ్రెజిల్తో విద్యుత్, జీవ ఇంధనం, రక్షణ, వ్యవసాయ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి భారత్ కృతనిశ్చయంతో ఉందని మోదీ చెప్పారు. ఫార్మాస్యూటికల్స్, టెక్నాలజీ, స్పేస్ తదితర రంగాల్లో చిలీతో సంబంధాలు బలపడుతున్నాయని తెలిపారు. చిలీలో ఆయుర్వేదానికి ప్రాధాన్యత పెరగడం ఆనందంగా ఉందన్నారు.
Similar News
News November 15, 2025
ఇకనైనా ‘వలస’ జీవులకు విముక్తి లభించేనా?

బిహార్లో మరోసారి ఎన్డీఏ తమ ప్రభుత్వాన్ని నెలకొల్పనుంది. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి జీవనోపాధి పొందుతున్న లక్షలాది మంది తిరిగి తమ ఉపాధి క్షేత్రాలకు తిరిగిరానున్నారు. ఈక్రమంలో ఏళ్లు గడుస్తున్నా వలస జీవుల బతుకులు మారట్లేదని, ప్రజలకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయనే చర్చ జరుగుతోంది. స్థిరమైన ప్రభుత్వం రావడంతో ఇకనైనా కంపెనీలు నెలకొల్పి స్థానికంగా ఉపాధి కల్పించాలని సూచిస్తున్నారు.
News November 15, 2025
APPLY NOW: RRUలో 9 పోస్టులు

గుజరాత్లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ<
News November 15, 2025
మొత్తం పెట్టుబడులు రూ.13 లక్షల కోట్లు: CBN

AP: CII సదస్సు ద్వారా రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని CM CBN ప్రకటించారు. గత 18నెలల్లో ఇన్వెస్ట్మెంట్స్ రూ.22లక్షల కోట్లకు చేరాయన్నారు. శ్రీసిటీలో మరికొన్ని యూనిట్లను ఆయన వర్చువల్గా ప్రారంభించారు. 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు కంపెనీలతో MoUలు కుదుర్చుకున్నారు. వీటి ద్వారా 12,365 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. 2028 నాటికి శ్రీసిటీని ఉత్తమ పారిశ్రామిక ప్రాజెక్టుగా మారుస్తామని స్పష్టం చేశారు.


