News July 4, 2024
బుమ్రా కొడుకును ఆడించిన మోదీ

టీమ్ ఇండియా స్టార్ పేసర్ బుమ్రా తన కుటుంబంతో సహా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా బుమ్రా కొడుకు అంగద్ను మోదీ ఎత్తుకుని కాసేపు ఆడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు టీమ్ ఇండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ కూడా మోదీతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Similar News
News March 15, 2026
హార్ముజ్కు యుద్ధ నౌకలు పంపండి: ట్రంప్

హార్ముజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు US అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇరాన్ వల్ల ఇబ్బందులు పడుతున్న దేశాలు అమెరికాతో కలిసి యుద్ధ నౌకలను హార్ముజ్కు పంపాలని తాజాగా కోరారు. చైనా, ఫ్రాన్స్, జపాన్, ద.కొరియా, UK తదితర దేశాలు ప్రభావితమయ్యాయని, అవి తమ వార్షిప్స్ను పంపిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా వందలాది సరకు రవాణా నౌకలు హార్ముజ్లో నిలిచిపోవడంతో ప్రపంచం అతలాకుతలం అవుతోంది.
News March 14, 2026
ఖమేనీ అందుకే బంకర్లోకి వెళ్లలేదు: ఇరాన్ ప్రతినిధి

దేశ ప్రజలను ఆపదలో వదిలేసి తాను సేఫ్ బంకర్లోకి వెళ్లడానికి ఖమేనీ ఇష్టపడలేదని భారత్లో సుప్రీం లీడర్ ప్రతినిధి హకీమ్ India Today కాంక్లేవ్లో తెలిపారు. ఇరాన్లోని 9Cr మందికి సేఫ్ షెల్టర్ ఏర్పాటు చేసినప్పుడే తానూ బంకర్ హౌస్లోకి మారతానన్నారని చెప్పారు. నివాసాన్ని బంకర్ బేస్మెంట్తో పటిష్ఠంగా మార్చడానికీ అంగీకరించలేదన్నారు. కాగా US-ఇజ్రాయెల్ మిస్సైల్ దాడిలో ఖమేనీ సహా పలువురు కుటుంబీకులు మరణించారు.
News March 14, 2026
దేవాన్ష్ ధోతీ ఫంక్షన్లో నారా, నందమూరి ఫ్యామిలీ

AP: సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి లోకేశ్ కుమారుడు దేవాన్ష్ ధోతీ వేడుక ఇవాళ HYDలో జరిగింది. ఈ కార్యక్రమంలో నారా, నందమూరి ఫ్యామిలీ సందడి చేసింది. అమ్మమ్మ వారి తరఫున నందమూరి బాలకృష్ణ దంపతులు దేవాన్ష్తో పాటు లోకేశ్, బ్రాహ్మణికి నూతన వస్త్రాలు పెట్టారు. అనంతరం అందరూ కలిసి ఫొటోలు దిగారు. వీటిని లోకేశ్ Xలో షేర్ చేశారు. దేవాన్ష్ ఎదుగుదల చూసి తామందరికీ ఎంతో ఆనందంగా ఉందన్నారు.


