News March 16, 2024

మోడీ సభ.. జగిత్యాల ఎస్పీ కీలక ప్రకటన!

image

ఈనెల 18న జగిత్యాలలో ప్రధాని బహిరంగ సభ సందర్భంగా పట్టణంలోని పలు ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని జిల్లా SP సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోనికి ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు భారీ వాహనాల అనుమతి లేదన్నారు. కరీంనగర్, నిజామాబాద్ మధ్య నడిచే వాహనాలు ధరూర్ కెనాల్ బైపాస్ ద్వారా వెళ్లాలన్నారు. ధర్మపురి, కరీంనగర్ మధ్య నడిచే వాహనాలు పొలాస, తిమ్మాపూర్ బైపాస్ మీదుగా వెళ్లాలన్నరు .

Similar News

News December 28, 2025

జమ్మికుంట: అంబేద్కర్ వర్సిటీ పరీక్షా ఫీజు గడువు పొడిగింపు

image

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు పరీక్షా ఫీజు చెల్లించే గడువును జనవరి 2వ తేదీ వరకు పొడిగించినట్లు జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బి.రమేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దూరవిద్య విధానంలో బి.ఏ, బి.కామ్‌, బి.ఎస్సీ చదువుతున్న మొదటి, మూడు, ఐదో సెమిస్టర్‌ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News December 28, 2025

KNR: ఇసుక అక్రమ రవాణా.. 170 కేసులు

image

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో 170 ఇసుక అక్రమ రవాణా కేసులు నమోదు కాగా.. 249 మంది పట్టుబడ్డారు. వీరి నుంచి 8 ట్రాక్టర్లు, 7 లారీలు, 3 టిప్పర్స్, 3 జేసీబీలు, 3 బొలెరో వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఇసుక ఖరీదు ₹6,75,500 ఉందని సీపీ గౌస్ ఆలం పేర్కొన్నారు. పోలీసులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నా ఇసుక మాఫియాకు అడ్డుకట్ట పడడం లేదు.

News December 28, 2025

KNR: ఇసుక అక్రమ రవాణా.. 170 కేసులు

image

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో 170 ఇసుక అక్రమ రవాణా కేసులు నమోదు కాగా.. 249 మంది పట్టుబడ్డారు. వీరి నుంచి 8 ట్రాక్టర్లు, 7 లారీలు, 3 టిప్పర్స్, 3 జేసీబీలు, 3 బొలెరో వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఇసుక ఖరీదు ₹6,75,500 ఉందని సీపీ గౌస్ ఆలం పేర్కొన్నారు. పోలీసులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నా ఇసుక మాఫియాకు అడ్డుకట్ట పడడం లేదు.