News March 18, 2024

జగిత్యాలలో తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టిన మోదీ

image

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత తెలంగాణలో తొలిసారి నిర్వహిస్తున్న జగిత్యాల సభ ద్వారా కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ప్రధాని మోదీ ఎన్నికల శంఖాన్ని పూరించారు. ‘నా తెలంగాణ కుటుంబసభ్యులందరికీ నమస్కారాలు’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని మొదలు పెట్టారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలిక్టాప్టర్​లో జగిత్యాల చేరుకున్న మోదీకి పార్టీనాయకుల నుంచి ఘనస్వాగతం లభించింది.

Similar News

News September 3, 2025

NZB: నగర పాలక సంస్థలో ACB దాడులు

image

నిజామాబాద్ నగరపాలక సంస్థలో బుధవారం ACB అధికారులు దాడులు చేశారు. రిటైర్డ్ ఆర్మీ జవాన్ పండ్ల దుకాణానికి అనుమతి కోసం రూ.7 వేలు లంచం డిమాండ్ చేసిన RI శ్రీనివాస్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. రిటైర్డ్ జవాన్ ఫిర్యాదు మేరకు ఈ దాడులు నిర్వహించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 3, 2025

జాతీయస్థాయి పోటీలకు NZB క్రీడాకారులు

image

జాతీయస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు జిల్లాకి చెందిన ఇద్దరు క్రీడాకారులు నేహాల్ అఫ్సర్, ఐశ్వర్య ఎంపికయ్యారని జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బొబ్బిలి నరేష్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు లూథియానా(పంజాబ్)లో ఈనెల 2 నుంచి నుంచి 9 వరకు జరిగే 75వ జూనియర్ నేషనల్స్‌లో పాల్గొంటారు. ఎంపికైన క్రీడాకారులను బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు సీనియర్ క్రీడాకారులు అభినందించారు.

News September 3, 2025

SRSP UPDATE.. 29 గేట్ల నుంచి నీటి విడుదల

image

ఎస్సారెస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతోంది. ఎస్సారెస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతోంది. లక్షా 50 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా 29 వరద గేట్ల ద్వారా లక్షా 51 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా 18 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 4500, ఎస్కెప్ గేట్ల ద్వారా 3500, మిషన్ భగీరథ ద్వారా 231, ఆవిరి రూపంలో 666 క్యూసెక్కుల నీరు పోతుంది.