News November 15, 2024
ఐఏఎఫ్ విమానంలో ఢిల్లీకి మోదీ

ఝార్ఖండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శుక్రవారం ఐఏఎఫ్ విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. ముందుగా ఆయన ప్రయాణించాల్సిన విమానంలో <<14619050>>సాంకేతిక లోపం<<>> తలెత్తింది. దీంతో ఆయన దేవ్ఘర్ విమానాశ్రయంలో వేచిచూడాల్సి వచ్చింది. కొంత సమయం తరువాత కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో చివరికి ఐఏఎఫ్ విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. మోదీ విమానంలో సమస్య కారణంగా ఇతర విమానాల టేకాఫ్, ల్యాండింగ్ ఆలస్యమైంది.
Similar News
News November 22, 2025
GREAT: బ్యాగులో రూ.10,00,000.. అయినా పైసా ముట్టలేదు!

పుణే(MH)కు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు అంజు మనే గొప్ప మనసు చాటుకున్నారు. గురువారం చెత్త ఏరుతుండగా ఆమెకు ఓ బ్యాగ్ దొరికింది. అందులో డబ్బు, మెడిసిన్లు కనిపించాయి. అది ఎవరిదో కనుక్కునేందుకు ఆ వీధి అంతా తిరిగింది. ఓ వ్యక్తి టెన్షన్తో కనిపించడంతో అతడికి వాటర్ ఇచ్చింది. బ్యాగ్ దొరికిందని ఇచ్చేసింది. అందులో రూ.10 లక్షల క్యాష్ ఉంది. దీంతో ఆమె నిజాయతీకి మెచ్చిన బ్యాగ్ యజమాని చీర, కొంత డబ్బు ఇచ్చాడు.
News November 22, 2025
ఈ నెల 25 నుంచి 17వ పౌల్ట్రీ ఇండియా ప్రదర్శన

దక్షిణాసియాలోనే అతిపెద్ద 17వ పౌల్ట్రీ ఇండియా-2025 ప్రదర్శన ఈ నెల 25-28 వరకు HYDలోని HICCలో జరగనుంది. దీనికి 1,500 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు, 50 దేశాల నుంచి 500లకు పైగా ఎగ్జిబిటర్లు, 40 వేలకు పైగా సందర్శకులు హాజరుకానున్నారు. పౌల్ట్రీరంగంలో సమస్యలు, AI, ఆటోమేషన్, ఉపాధి వంటి అంశాలపై సెమినార్లు నిర్వహిస్తారు. ఈ సదస్సుకు హాజరుకావాలని CM రేవంత్రెడ్డికి నిర్వాహకులు ఆహ్వానం అందించారు.
News November 22, 2025
‘RRR’పై రీసర్వే చేయండి.. గడ్కరీకి కవిత లేఖ

TG: రీజినల్ రింగ్ రోడ్డు(RRR) అలైన్మెంట్పై రీసర్వే చేయాలని కోరుతూ కేంద్రమంత్రి గడ్కరీకి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లేఖ రాశారు. ‘రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని గ్రామాల్లో అలైన్మెంట్ను చాలాసార్లు <<18295771>>మార్చారు<<>>. రాజకీయ నేతలు, భూస్వాముల కోసం ఇలా చేశారని స్థానికులు నమ్ముతున్నారు. చిన్న రైతులే నష్టపోతున్నారు’ అని పేర్కొన్నారు. రీసర్వే చేసి, అలైన్మెంట్ ఖరారుకు ముందు స్థానికులతో చర్చించాలని కోరారు.


