News June 19, 2024
ఈ నెల 21న శ్రీనగర్కు మోదీ: కేంద్ర మంత్రి

ఈ నెల 21న ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్లో పర్యటించనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీనగర్లో జరిగే కార్యక్రమంలో 9వేల మందితో కలిసి యోగా చేస్తారని మీడియాకు తెలిపారు. 20 జిల్లాల నుంచి 2వేల మంది చొప్పున వర్చువల్గా పాల్గొనేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది జమ్మూకశ్మీర్వ్యాప్తంగా మంచి ప్రభావం చూపిస్తుందని ఆకాంక్షించారు.
Similar News
News January 26, 2026
నేడు గిగ్ వర్కర్ల సమ్మె.. నిలిచిపోనున్న డెలివరీ సేవలు!

గిగ్ వర్కర్లు ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. దీంతో స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి యాప్ల సేవలు నిలిచిపోనున్నాయి. వర్కర్లందరూ యాప్ల నుంచి లాగౌట్ చేసి నిరసన చేపట్టనున్నట్లు గిగ్&ప్లాట్ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ ప్రకటించింది. దీంతో డెలివరీ సేవలు నిలిచిపోవడం లేదా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే Feb 3న మరోసారి ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
News January 26, 2026
ఈ 5 రోజులు ఎంతో పుణ్యమైనవి.. ఎందుకంటే?

మాఘ శుద్ధ సప్తమి నుంచి ఏకాదశి వరకు గల 5 రోజులను ‘భీష్మ పంచకాలు’ అంటారు. యుద్ధంలో గాయపడిన భీష్ముడు, సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన తర్వాతే తన ప్రాణాలను విడవాలని నిశ్చయించుకున్నారు. అందుకే సప్తమి నుంచి 5 రోజుల పాటు ఒక్కో ప్రాణాన్ని విడుస్తూ అష్టమి నాటికి సిద్ధమయ్యారు. ఈ 5 రోజులు ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనవి. ఈ సమయంలో చేసే జపతపాలు అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదిస్తాయని భక్తుల విశ్వాసం.
News January 26, 2026
మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్?

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో మోక్షజ్ఞ తొలి సినిమాను లాంచ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ‘ఆదిత్య 369’కి సీక్వెల్గా ‘ఆదిత్య 999 మ్యాక్స్’ అనే టైటిల్తో రూపొందనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఈ మూవీని క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


