News June 19, 2024

ఈ నెల 21న శ్రీనగర్‌‌కు మోదీ: కేంద్ర మంత్రి

image

ఈ నెల 21న ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీనగర్‌లో జరిగే కార్యక్రమంలో 9వేల మందితో కలిసి యోగా చేస్తారని మీడియాకు తెలిపారు. 20 జిల్లాల నుంచి 2వేల మంది చొప్పున వర్చువల్‌గా పాల్గొనేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది జమ్మూకశ్మీర్‌వ్యాప్తంగా మంచి ప్రభావం చూపిస్తుందని ఆకాంక్షించారు.

Similar News

News October 31, 2025

వెడ్డింగ్ సీజన్: ₹6.5 లక్షల కోట్ల వ్యాపారం.. కోటి ఉద్యోగాలు

image

నవంబర్ 1 నుంచి వెడ్డింగ్ సీజన్ మొదలు కాబోతోంది. 45 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా 46 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) రీసెర్చ్‌ అంచనా వేసింది. ఈ పెళ్లి వేడుకలతో రూ.6.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని తెలిపింది. కోటి ఉద్యోగాలు జెనరేట్ అవుతాయని వెల్లడించింది. 2024లో 48 లక్షల పెళ్లిళ్లు, 5.9 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు వివరించింది.

News October 31, 2025

అక్టోబర్ 31: చరిత్రలో ఈరోజు

image

1875: స్వాతంత్ర్య సమరయోధుడు, భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జననం
1895: IND టెస్ట్ టీమ్ తొలి కెప్టెన్ CK.నాయుడు జననం
1975: సంగీత దర్శకుడు ఎస్‌డీ బర్మన్ మరణం
1984: మాజీ PM ఇందిరా గాంధీ మరణం
1990: గాయని ML.వసంతకుమారి మరణం
2022: పారిశ్రామికవేత్త జేజే ఇరానీ మరణం
* జాతీయ ఐక్యతా దినోత్సవం (వల్లభ్‌భాయ్ జయంతిని కేంద్రం జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుతోంది)

News October 31, 2025

పెళ్లి చేసుకున్న నారా రోహిత్, నటి శిరీష

image

టాలీవుడ్ హీరో నారా రోహిత్, నటి శిరీష వివాహం గురువారం రాత్రి వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వీరిద్దరూ ఏడడుగులు వేశారు. AP CM చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేశ్ తదితరులు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రోహిత్, శిరీష ‘ప్రతినిధి-2’ సినిమాలో జంటగా నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారడంతో వివాహబంధంతో ఒక్కటయ్యారు.