News March 3, 2025
త్వరలో ఏపీ పర్యటనకు మోదీ?

AP: కృష్ణా జిల్లా నాగాయలంక(మ) గుల్లలమోదలో క్షిపణి పరీక్షా కేంద్రం శంకుస్థాపనకు ప్రధాని మోదీ రానున్నారు. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు కోసం DRDO రూ.15-20వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఇక్కడ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అనుకూలమని 2011లోనే తేలింది. 2017లో భూకేటాయింపులు జరిగినా, మిగతా పనులు నిలిచాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో దీనిపై చర్చించగా, శంకుస్థాపనకు తానే వస్తానని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది.
Similar News
News January 13, 2026
ఇరాన్ టారిఫ్ బాంబ్.. భారత్పై ప్రభావమెంత?

ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాలపై <<18842223>>25% టారిఫ్<<>> విధిస్తామని అమెరికా ప్రకటించింది. ఇది భారత్కూ వర్తిస్తుంది. ఇప్పటికే రష్యాతో చమురు కొనుగోలు వల్ల US మనపై 50% సుంకాలు బాదుతోంది. తాజాగా ఇరాన్ ఎఫెక్ట్ కూడా పడితే మొత్తంగా అగ్రరాజ్యానికి మనం చేసే ఎగుమతులపై 75% టారిఫ్లు కట్టాల్సి వస్తుంది. టెహ్రాన్లోని ఎంబసీ లెక్కల ప్రకారం.. భారత్-ఇరాన్ మధ్య $1.68B (దాదాపు రూ.15,150 కోట్లు) బైలేటరల్ ట్రేడ్ కొనసాగుతోంది.
News January 13, 2026
రొయ్యల చెరువులో ఈ మార్పులు కనిపిస్తే..

కొన్నిసార్లు రొయ్యల చెరువులో నీటి నాణ్యత చాలా వేగంగా పడిపోతుంది. రొయ్యలు చెరువు అడుగు భాగంలోనే ఎక్కువ కాలం పాటు ఉంటాయి. ఒకవేళ చెరువు అడుగు భాగం చెడితే రొయ్యల ఆరోగ్యం దెబ్బతింటుంది. చెరువు అడుగు భాగం పాడైనట్లు కొన్ని సంకేతాలతో గుర్తించవచ్చు. కుళ్లిన గుడ్డు వాసన రావడం, రొయ్యలు చెరువు అంచులకు లేదా ఎయిరేటర్ల దగ్గరకు ఎక్కువగా చేరటం, అధిక బురద, రొయ్యలు బలహీనంగా మారటం వంటి లక్షణాలతో గుర్తించవచ్చు.
News January 13, 2026
ఊర్లలో.. ఏదైనా ప్లాన్ చేద్దాం.. ట్రెండింగ్ టాపిక్!

పండుగకు అంతా వస్తుండటంతో ఊర్లు సందడిగా మారాయి. ఇరుగు-పొరుగు, బంధువులు, ఫ్రెండ్స్ కుశల ప్రశ్నలతో కోలాహలం కన్పిస్తోంది. ఇన్నాళ్లూ.. ఎదుటి వారి నుంచి ‘ఏం చేస్తున్నారు?’ అనే ప్రశ్నలు సాధారణంగా వచ్చేవి. ఈసారి ‘ఇక్కడే ఏదైనా బిజినెస్ ప్లాన్ చేద్దామా?’ అని ప్లాన్స్, డిస్కస్ చేస్తున్నట్లు చాలా ఊర్ల నుంచి సమాచారం. మీ సర్కిళ్లోనూ పిచ్చాపాటితో పాటు ఈ చర్చలు జరుగుతున్నాయా? కామెంట్.


