News November 29, 2024

మోదీ VS దీదీ: చల్లబడ్డ ‘ఫైర్’ బ్రాండ్!

image

ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం, బంగ్లా అల్లర్ల తర్వాత బెంగాల్ CM మమతా బెనర్జీ పంథా మార్చుకున్నట్టు కనిపిస్తోంది. మునుపటిలా కేంద్రం, PM మోదీపై విరుచుకుపడటం లేదు. అంశాలవారీగా మద్దతిస్తున్నారు. మొదట్లో బంగ్లా సంబంధాలపై నాలుక్కర్చుకున్న ఆమె ఆ తర్వాత కేంద్ర వైఖరినే అనుసరిస్తున్నారు. అక్కడి హిందువులపై సానుభూతి చూపుతున్నారు. INDIA కూటమి అదానీ అంశంపై పార్లమెంటును అడ్డుకోవద్దని చెప్పడం విశేషం.

Similar News

News December 8, 2025

చాట్రాయి: సామాన్యుల సమస్యలపై స్పందించిన మంత్రి

image

చనుబండలో సామాన్యులు చెప్పిన సమస్యలపై తక్షణమే స్పందించిన మంత్రి కొలుసు సారథి, సొంత ఖర్చులతో డ్రైనేజీలో తూరలు వేయించారు. సోమవారం చనుబండలో మంత్రి ఈ పనులు పూర్తి చేయించడంతో బలహీన వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గత 48 గంటల క్రితం మంత్రి గ్రామానికి వచ్చిన సందర్భంలో ప్రజలు సమస్యను ప్రత్యక్షంగా చూపించారని, వెంటనే పనులు పూర్తి చేయడం సంతోషదాయకంగా ఉందని పలువురు పేర్కొన్నారు.

News December 8, 2025

ఆ రెండు రోజులు స్కూళ్లకు సెలవులు!

image

TGలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఈ నెల 11,14,17 తేదీల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. తొలి విడతలో 4,236, రెండో విడతలో 4,333, మూడో విడతలో 4,159 గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటి కోసం గ్రామాల్లోని స్కూళ్లలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 14న ఆదివారం కాగా 11,17న పోలింగ్ జరిగే స్కూళ్లకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే ప్రకటన రావచ్చు.

News December 8, 2025

YCP కక్షపూరిత రాజకీయాలతో ఖజానాకు నష్టం: CM

image

AP: YCP కక్షపూరిత రాజకీయాలతో గతంలో ప్రజాధనం నష్టమైందని CM CBN విమర్శించారు. ‘PPAల రద్దుతో విద్యుత్ వాడకుండానే ₹9వేల కోట్లు కట్టాల్సి వచ్చింది. మూలధన వ్యయం లేక ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఆస్తుల్నే కాకుండా భవిష్యత్తు ఆదాయాన్నీ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. ఎంత కష్టమైనా సరే హామీలను నెరవేరుస్తున్నాం. ఆగిన పథకాలను పునరుద్ధరించాం’ అని CM వివరించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లు తెలిపారు.