News July 6, 2024

మోదీ అయోధ్య నుంచే పోటీ చేద్దామనుకున్నారు.. కానీ: రాహుల్

image

తనకు నేరుగా దేవుడితో కనెక్షన్ ఉందని చెప్పే మోదీ.. అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడిపోయిందో చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అహ్మదాబాద్‌లో పర్యటిస్తున్న ఆయన ‘మోదీ అయోధ్య నుంచే పోటీ చేద్దామనుకున్నారు. కానీ ఓడిపోతారని సర్వేలు చెప్పాయి. తన రాజకీయ జీవితం అయోధ్యలో ముగుస్తుందనే భయంతో మోదీ పోటీ చేయలేదు’ అని ఎద్దేవా చేశారు. కాగా ఎల్లుండి తాను మణిపుర్‌ వెళ్లనున్నట్లు రాహుల్ తెలిపారు.

Similar News

News March 15, 2026

ChatGPTని దాటేసిన ఇండియన్ ఆయిల్

image

దేశంలో వంటగ్యాస్ సిలిండర్ల డెలివరీ ఆలస్యం అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో చాలా మంది ఇండియన్ ఆయిల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఫలితంగా గూగుల్ ప్లే స్టోర్‌లో ChatGPTని దాటేసి ఇండియన్ ఆయిల్ యాప్ నంబర్-1గా నిలిచింది. ఆ యాప్‌లో ఎల్పీజీ కనెక్షన్స్, సిలిండర్ బుకింగ్, ట్రాకింగ్, డిస్ట్రిబ్యూటర్ మార్పు, మెకానిక్ సర్వీసులు లాంటి సేవలు అందుబాటులో ఉన్నాయి.

News March 15, 2026

ఇదే ఊపు కొనసాగుతుంది: రోహిత్ శర్మ

image

భారత క్రికెట్ గత రెండేళ్లుగా సాధిస్తున్న విజయాలపై రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. ముంబైలో మహిళల జట్టు WC నెగ్గడం, ఇటీవల మెన్స్ T20 WCను కైవసం చేసుకోవడం అద్భుతమని కొనియాడారు. ‘ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడటం ఉండదు’ అని ధీమా వ్యక్తం చేశారు. పురుషుల, మహిళల జట్లు రెండూ ప్రస్తుతం ఫుల్ ‘మొమెంటం’లో ఉన్నాయని, ఇదే ఊపు భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

News March 15, 2026

బ్లాక్ మార్కెట్‌లో వంట గ్యాస్ సిలిండర్ రూ.6,500

image

వంట గ్యాస్‌ను బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరిస్తున్నా అక్రమార్కులు ఆగట్లేదు. NDTV పలు రాష్ట్రాల్లో చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. గ్యాస్ సిలిండర్‌కు ₹6,500, 14KGలు రీఫిల్ చేయడానికి ₹3,500-₹4K వరకు తీసుకుంటున్నారు. స్టవ్ రిపేర్ సెంటర్లు, కిరాణా దుకాణాల ద్వారా ఈ రాకెట్ నడుపుతున్నారు. ఏజెన్సీలే వీరికి బ్లాక్‌లో గ్యాస్ ఇస్తున్నట్లు తేలింది.