News August 7, 2025
ఉపరాష్ట్రపతి అభ్యర్థిని మోదీ ఫైనల్ చేస్తారు: కిరణ్ రిజుజు

ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రధాని మోదీ, BJP జాతీయ అధ్యక్షుడు JP నడ్డా ఎంపిక చేస్తారని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. ఢిల్లీలో జరిగిన NDA నేతల కీలక సమావేశం అనంతరం కిరణ్ మీడియాతో మాట్లాడారు. ‘తొలుత కొందరిని నడ్డా ఎంపిక చేస్తారు. ఆ తర్వాత వారిలో ఒకరిని మోదీ ఫైనల్ చేస్తారు. వచ్చే నెల 9లోగా అభ్యర్థి పేరు ఖరారు చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైంది.
Similar News
News August 7, 2025
పోలీసులు, టీడీపీ నేతల కుమ్మక్కు: బొత్స

AP: రాష్ట్రంలో పోలీసులు, TDP నేతలు కుమ్మక్కై YCP నేతలపై దాడులకు పాల్పడుతున్నారని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కూటమి సర్కార్ దుష్ట పాలన చేస్తోందని మండిపడ్డారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ను బొత్స, కారుమూరి, కొట్టు, వెల్లంపల్లి కలిశారు. ‘కూటమి ప్రభుత్వ అరాచకాలపై గవర్నర్కు ఫిర్యాదు చేయగా సానుకూలంగా స్పందించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పులివెందుల ZPTC ఎన్నిక నిర్వహించాలని కోరాం’ అని తెలిపారు.
News August 7, 2025
భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్

TG: రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలపై CM రేవంత్ స్పందించారు. ‘భారీ వర్షాల సమాచారం దృష్ట్యా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి. HYDలో భారీ వర్షసూచన దృష్ట్యా అధికారులు సమన్వయంతో పని చేయాలి. వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలకు వెంటనే సంబంధిత సిబ్బంది చేరుకొని చర్యలు చేపట్టాలి’ అని ఆదేశించారు.
News August 7, 2025
రోజూ మాంసం తింటే..!

ముక్క లేనిదే ముద్ద దిగదు అనేవారు ఎక్కువ కాలం జీవించలేరని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. రోజూ లేదా వారానికి మూడు కంటె ఎక్కువ సార్లు ప్రాసెస్డ్ & రెడ్ మీట్ తినడం ఆరోగ్యానికి హానికరం అని తేలింది. 4,75,000 మందిపై చేసిన అధ్యయనంలో మాంసం తినడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి 25 రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని గుర్తించారు. పరిమితంగా మాంసం తినొచ్చని సూచించారు.