News April 4, 2024
మోదీజీ మీరు మత్తులో ఉన్నారా?: ఖర్గే

PM మోదీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. ‘భయపడట్లేదు అంటున్న మీరు, భారత్లోకి చైనా చొరబడుతుంటే ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? నిద్రమాత్రలు తీసుకున్నారా? విదేశాలతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో పర్యటిస్తున్న మోదీ మణిపూర్కు ఎందుకు వెళ్లట్లేదు? కుటుంబ పాలన గురించి మాట్లాడతారు, కానీ 1989 తర్వాత గాంధీ కుటుంబం నుంచి ఎవరైనా ప్రధాని లేదా మంత్రి అయ్యారా?’ అని ప్రశ్నించారు.
Similar News
News February 11, 2026
అంకితభావంతో పనిచేస్తే రిజల్ట్ ఇలా ఉంటుంది!

ఇండోర్(MP) మున్సిపల్ కమిషనర్గా IAS అధికారి అశీష్ సింగ్ అద్భుతం చేశారు. 2018లో 6 నెలల్లో 13 లక్షల టన్నుల వ్యర్థాలను తొలగించి రూ.400కోట్ల విలువైన 100 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. అద్దె యంత్రాలు వాడటంతో ₹65 కోట్ల ఖర్చును ₹10 కోట్లకు తగ్గించారు. ఆయన చూపిన పాలనా దక్షతతోనే ఇండోర్ నేడు దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా వెలుగొందుతోంది. ఇలాంటి అంకితభావం కలిగిన అధికారులే దేశానికి అవసరం. ఏమంటారు?
News February 11, 2026
తేనెతో జుట్టుకు పోషణ

తేనె వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. అయితే తేనె సౌందర్య పరిరక్షణలో, జుట్టు సంరక్షణలోనూ కీలకపాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. * తేనె, ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తల స్నానం చేయడం వల్ల జుట్టు పట్టులా మెరుస్తుందని చెబుతున్నారు. *తలస్నానం చేసేముందు తేనె, పాలు కలిపి తలకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా తయారవుతుందని తెలిపారు.
News February 11, 2026
నక్షత్ర దోషాలకు పరిహారం ఏంటి?

ఆశ్లేష, జ్యేష్ఠ, మూల వంటి ప్రత్యేక నక్షత్రాల్లో జన్మించిన వారికి వివాహ దోషాలు ఉంటాయని జ్యోతిషం చెబుతోంది. ఇవి వైవాహిక జీవితంపై ప్రభావం చూపుతాయి. ఇలాంటి దోషాల నివారణకు అమ్మవారి ఆరాధన శ్రేయస్కరం. ‘మంగళ గౌరీ వ్రతం’ ఆచరించడం వల్ల కన్యాదోషాలు తొలగిపోతాయి. ప్రతి నిత్యం లలితా అష్టోత్తరం చదవడం, శుక్రవారం నాడు ముత్తైదువులకు తాంబూలం ఇవ్వడం వల్ల గ్రహాల అనుకూలత పెరుగుతుంది. సత్వరమే వివాహ ఘడియలు దగ్గరపడతాయి.


