News January 10, 2025

మోదీజీ.. ఇగో పక్కనపెట్టి రైతులతో చర్చించండి: ప్రియాంక

image

ఢిల్లీ సరిహద్దుల్లో నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లాల్ ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ అన్నారు. రైతుల పట్ల కేంద్రం క్రూరంగా ప్రవర్తిస్తోందని ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ప్రధాని మోదీ తన ఇగోను పక్కనపెట్టి అన్నదాతలతో చర్చలు జరపాలని సూచించారు. ఈ మొండి వైఖరే గతంలో 700 మంది రైతులను పొట్టనబెట్టుకుందని ప్రియాంక ఆరోపించారు.

Similar News

News November 21, 2025

సిట్‌కు అన్నీ వాస్తవాలే చెప్పా: వైవీ సుబ్బారెడ్డి

image

AP: కల్తీ నెయ్యి వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి నివాసంలో సిట్ విచారణ ముగిసింది. తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. సిట్‌కు అన్నీ వాస్తవాలే చెప్పానని తెలిపారు. దర్యాప్తుకు అన్ని విధాలుగా సహకరిస్తానని అన్నారు. కల్తీ నెయ్యి విషయంలో నిజానిజాలు ప్రజలకు తెలియాలనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు. 2018 తర్వాతి నుంచి చిన్న అప్పన్న తన దగ్గర పీఏగా పని చేయడం లేదని పేర్కొన్నారు.

News November 21, 2025

సిట్‌కు అన్నీ వాస్తవాలే చెప్పా: వైవీ సుబ్బారెడ్డి

image

AP: కల్తీ నెయ్యి వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి నివాసంలో సిట్ విచారణ ముగిసింది. తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. సిట్‌కు అన్నీ వాస్తవాలే చెప్పానని తెలిపారు. దర్యాప్తుకు అన్ని విధాలుగా సహకరిస్తానని అన్నారు. కల్తీ నెయ్యి విషయంలో నిజానిజాలు ప్రజలకు తెలియాలనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు. 2018 తర్వాతి నుంచి చిన్న అప్పన్న తన దగ్గర పీఏగా పని చేయడం లేదని పేర్కొన్నారు.

News November 21, 2025

CRICKET UPDATES

image

* రేపటి నుంచి యాషెస్ సంగ్రామం.. ఉ.7.50 గంటలకు పెర్త్ వేదికగా ఆసీస్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభం
* ట్రై సిరీస్‌లో శ్రీలంకకు షాక్ ఇచ్చిన జింబాబ్వే.. 163 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక 95 రన్స్‌కే కుప్పకూలిన లంక
* ఈ నెల 27న WPL వేలం.. తొలి సెట్లో వేలానికి రానున్న దీప్తి శర్మ, రేణుకా సింగ్
* వందో టెస్టులో సెంచరీ బాదిన బంగ్లా స్టార్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్.. ఈ ఘనత సాధించిన 11వ ఆటగాడిగా రికార్డ్