News March 17, 2024
ఏపీ ప్రజలకు మోదీ విజ్ఞప్తి

ఏపీ ప్రజలు 2 సంకల్పాలు తీసుకుంటారని తాను భావిస్తున్నట్లు ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘తొలి సంకల్పం కేంద్రంలో ఎన్డీఏ సర్కారును మూడోసారి ఏర్పాటు చేయడం. రెండో సంకల్పం APలో అవినీతి సర్కారుకు చరమగీతం పాడటం. ఇవి మనసులో పెట్టుకుని ప్రజలు ఓటేయాలి. జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ చీల్చే ప్రయత్నం చేస్తోంది. NDA సర్కారును గెలిపిస్తే AP అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా’ అని వెల్లడించారు.
Similar News
News September 7, 2025
అక్టోబర్లో మోదీ-ట్రంప్ భేటీ?

ప్రధాని మోదీ, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చే నెలలో కలిసే అవకాశం ఉంది. అక్టోబర్ 26-28 వరకు మలేషియాలో ASEAN సమ్మిట్ జరగనుంది. ట్రంప్ ఆ సమావేశానికి వస్తున్నారని మలేషియా ప్రధాని కన్ఫామ్ చేశారు. కానీ మోదీ పర్యటనపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కాగా న్యూయార్క్(US)లో ఈనెల 23 నుంచి 29 వరకు జరగనున్న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA) హైలెవెల్ డిబేట్కు PM మోదీ <<17627443>>హాజరుకావడం<<>> లేదు.
News September 7, 2025
త్వరలో కేటీఆర్ జిల్లాల పర్యటన!

TG: లోకల్ బాడీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాల్లో, 13న గద్వాలలో ఆయన పర్యటిస్తారు. దసరాలోగా వీలైనన్ని జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఇటు స్థానిక సంస్థలతో పాటు అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.
News September 7, 2025
నేడే చంద్ర గ్రహణం.. ఈ పనులు మానుకోండి

నేడు రాత్రి 9.58కి చంద్ర గ్రహణం మొదలుకానుంది. కానీ <<17628465>>సూతక కాల<<>> ప్రభావం మధ్యాహ్నం 12.57 నుంచే ఉంటుందని పండితులు చెబుతున్నారు. ‘ఈ సమయంలో ఆహారం తీసుకోవద్దు. వండుకోవద్దు. ముందే వండిపెట్టిన ఆహారంపై దర్భ గడ్డి/తులసి ఆకులు వేసి ఉంచాలి. లేదంటే కలుషితం అవుతుంది. గ్రహణ సమయంలో శుభకార్యాలు, పూజలు వద్దు. SEP 8, 1.26AMకి గ్రహణం ముగుస్తుంది. ఆ తర్వాత దానాలు చేస్తే విశిష్టమైన ఫలితాలు లభిస్తాయి’ అని సూచిస్తున్నారు.