News January 8, 2025

అంధకార ఆంధ్రప్రదేశ్‌కు మోదీ రాకతో వెలుగులు: పవన్

image

AP: గత ఐదేళ్లు అవినీతి, అరాచక పాలనతో రాష్ట్రం అంధకారంలో కూరుకుపోయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ సభలో ఆరోపించారు. ఇవాళ మోదీ రాకతో రూ.2.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. పీఎం సడక్ యోజన ద్వారా గ్రామాలకు రోడ్లు వేస్తున్నామని, ఇంటింటికీ తాగు నీరు ఇస్తున్నామని పేర్కొన్నారు. పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో మోదీ వెలుగులు నింపుతున్నారని వెల్లడించారు.

Similar News

News October 14, 2025

ఈ మూడు దగ్గు సిరప్‌లు డేంజర్: WHO

image

భారత్‌లోని 3 ఫార్మా కంపెనీలకు చెందిన కాఫ్ సిరప్‌లను వాడొద్దని WHO హెచ్చరించింది. ఇందులో ఇటీవల 22 మంది పిల్లల మరణానికి కారణమైన శ్రేసన్ ఫార్మా ‘కోల్డ్రిఫ్’ కూడా ఉంది. దాంతో పాటు రెడ్‌నెక్స్ ఫార్మా ‘రెస్పిఫ్రెష్ TR’, షేప్ ఫార్మా ‘రీలైఫ్’ సిరప్‌లు ఆరోగ్యానికి హానికరమని పేర్కొంది. కాగా ఈ దగ్గు మందులు ఇతర దేశాలకు ఎగుమతి కాలేదని ఇండియన్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ WHOకు తెలిపింది.

News October 14, 2025

MCTEలో 18 పోస్టులు

image

క్యాడెట్స్ ట్రైనింగ్ వింగ్ ఆఫ్ మిలటరీ కాలేజీ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (MCTE)18 అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ, ఎంఎస్, MSc, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 31 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.

News October 14, 2025

రోజూ ఓంకారం జపిస్తే..?

image

శివుడి దివ్య సందేశం ప్రకారం.. శివుడి ధ్యానాన్ని విడవడమే మానవులలో అజ్ఞానం ప్రవేశించడానికి కారణం. నిజమైన జ్ఞానంతో ఉంటే మనుషులు కూడా శివుడితో సమానమైన సారూప్యాన్ని పొందే అవకాశం ఉండేది. అందుకే, అహంకారాన్ని నిర్మూలించి, జ్ఞానసిద్ధి పొందడానికి ఓంకారాన్ని జపించాలని శివుడు ఉపదేశించాడు. శివుడి ముఖం నుంచే జనించిన ఈ సర్వ మంగళప్రదమైన ఓంకారాన్ని నిత్యం స్మరిస్తే, శివుడిని స్మరించినట్లే అవుతుంది. <<-se>>#SIVOHAM<<>>