News April 24, 2024
కాంగ్రెస్-ముస్లింలపై మోదీ వ్యాఖ్యలు.. ఈసీకి ఫిర్యాదు

కాంగ్రెస్ గెలిస్తే ప్రజల సంపదను ముస్లింలకు పంపిణీ చేస్తుందన్న ప్రధాని మోదీ <<13098974>>వ్యాఖ్యలపై<<>> ఈసీకి హస్తం పార్టీ ఫిర్యాదు చేసింది. ఆయన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని, చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రజల్లో విభజన తెచ్చేలా ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని మోదీ మాట్లాడారని కాంగ్రెస్ పేర్కొంది. మొత్తంగా 17 అంశాలపై ఫిర్యాదు చేసింది. విపక్ష పార్టీపై ఆయన తప్పుడు నిందలు వేశారని తెలిపింది.
Similar News
News March 4, 2026
T20 WC ఎఫెక్ట్.. బాబర్పై పాక్ వేటు!

T20 WCలో విఫలమైన పాక్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజమ్పై PCB వేటువేసింది. బంగ్లాదేశ్తో జరిగే ODI సిరీస్ నుంచి అతడిని పక్కన పెట్టింది. షాహీన్ అఫ్రీది కెప్టెన్గా 15 మందితో స్క్వాడ్ను తాజాగా ప్రకటించింది. ఇందులో ఆరుగురు కొత్త ప్లేయర్లను తీసుకోవడం గమనార్హం. ఈ నెల 11 నుంచి పాక్-బంగ్లా మధ్య 3 వన్డేలు జరగనున్నాయి. T20 WCలో 4 ఇన్నింగ్స్లలో బాబర్ 91 పరుగులే చేశారు. అత్యధికంగా UAEపై 46 రన్స్ కొట్టారు.
News March 4, 2026
NATO దేశమైన తుర్కియేపైకి ఇరాన్ మిస్సైల్

మిడిల్ ఈస్ట్లో యుద్ధం మరిన్ని దేశాలకు పాకే అవకాశం ఉంది. NATO సభ్య దేశమైన తుర్కియేపైకి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని ఫైర్ చేసింది. ఇరాక్, సిరియా దేశాలపై నుంచి ఈ మిస్సైల్ దూసుకొచ్చిందని, దాన్ని NATO ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా అడ్డుకుందని తుర్కియే మంత్రి వెల్లడించారు. సిరియా సరిహద్దుల్లో శకలాలు పడ్డాయన్నారు. కాగా NATO దేశంపై దాడి జరిగితే మిగతా సభ్య దేశాలూ రంగంలోకి దిగాలనే నిబంధన ఉంది.
News March 4, 2026
శ్రీవారి పేరు ఉచ్చరించే నైతికత నీకుందా జగన్: బీఆర్ నాయుడు

AP: హిందుత్వం గురించి మాట్లాడే అర్హత <<19295165>>జగన్కు<<>> లేదని టీటీడీ ఛైర్మన్ BR నాయుడు విమర్శించారు. శ్రీవారి పేరు ఉచ్చరించే నైతికత ఆయనకు లేదని ఫైరయ్యారు. ‘హిందూ వ్యతిరేకి అయిన నువ్వు CMగా ఉన్నావనే వైవీ, భూమన హిందూ మత ఔన్నత్యాన్ని మంటగలిపారు. నేను ఛైర్మన్ అయ్యాక TTDని ప్రక్షాళన చేస్తున్నా. అందుకే నాపై ఫేక్ వీడియోలతో తిరుమల ప్రతిష్ఠ దెబ్బతీయాలని చూశావు’ అని మండిపడ్డారు.


