News July 26, 2024
ఆ స్కీమ్పై NDA, INDIAకు మోదీ పరోక్ష సంకేతాలు!

విపక్షాలు, మిత్ర పక్షాలకూ మోదీ ఒకేసారి ఓ సిగ్నల్ పంపినట్టు అనిపిస్తోంది. <<13711134>>అగ్నిపథ్ స్కీమ్<<>>ను ఎన్నికలకు ముందు ఇండియా కూటమి విమర్శించింది. రిజల్టు రాగానే JDU, LJP నేతలూ తిరిగి పరిశీలించాలన్నారు. స్కీమ్లో కేంద్రం మార్పులు చేస్తుందని బడ్జెట్ ముందు అనేక వార్తలు వచ్చాయి. అయితే అగ్నిపథ్ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆర్మీకిది అవసరమంటూ లద్దాక్ వద్ద ప్రధాని చేసిన ప్రసంగం వీటిని పటాపంచలు చేసింది.
Similar News
News October 31, 2025
త్వరలో 3 లక్షల ఇళ్లు ప్రారంభం: మంత్రి కొలుసు

AP: రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 3 లక్షల ఇళ్లను ప్రారంభిస్తామని గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఈ కార్యక్రమం ఈనెల 29న జరగాల్సి ఉండగా.. తుఫానుతో వాయిదా పడిందన్నారు. ఇప్పటికే అర్బన్ పరిధిలో 41 వేల ఇళ్లను మంజూరు చేశామని, రూరల్ పరిధిలో ఇంకా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వచ్చే నెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఏపీ టిడ్కోకు ప్రభుత్వం రూ.540 కోట్లు మంజూరు చేసింది.
News October 31, 2025
కిడ్నాప్ నుంచి త్రుటిలో తప్పించుకున్నా: నటి

ముంబైలో 20 మంది <<18153268>>కిడ్నాప్<<>>, నిందితుడు రోహిత్ ఆర్య ఎన్కౌంటర్ ఘటనపై మరాఠీ నటి రుచితా విజయ్ స్పందించారు. ‘రోహిత్ ఓ ప్రొడ్యూసర్గా నాకు పరిచయం. ఓ హోస్టేజ్ చిత్రం గురించి మాట్లాడటానికి OCT 28న కలవాల్సి ఉండగా అనివార్య కారణాలతో మీటింగ్ రద్దు చేసుకున్నా. మరుసటి రోజు అతని గురించి వినగానే షాకయ్యా. రోహిత్ బారిన పడకుండా దేవుడే కాపాడాడు. కొత్త వ్యక్తులతో పరిచయాలపై అప్రమత్తంగా ఉండాలి’ అని పేర్కొన్నారు.
News October 31, 2025
5 కేజీల భారీ నిమ్మకాయలను పండిస్తున్న రైతు

నిమ్మకాయ బాగా పెరిగితే కోడిగుడ్డు సైజులో ఉంటుంది. అయితే కర్నాటకలోని కొడుగు జిల్లా పలిబెట్టకు చెందిన విజు సుబ్రమణి అనే రైతు భారీ నిమ్మకాయలను పండిస్తున్నారు. ఇవి ఒక్కోటి పెద్ద సైజులో 5 కేజీల వరకు బరువు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం మైసూరు వెళ్లినప్పుడు అక్కడ మార్కెట్లో నిమ్మ విత్తనాలను కొని తన కాఫీ తోటలో సుబ్రమణి నాటారు. మూడేళ్ల తర్వాత నుంచి వాటిలో 2 మొక్కలకు ఈ భారీ సైజు నిమ్మకాయలు కాస్తున్నాయి.


