News July 26, 2024
ఆ స్కీమ్పై NDA, INDIAకు మోదీ పరోక్ష సంకేతాలు!

విపక్షాలు, మిత్ర పక్షాలకూ మోదీ ఒకేసారి ఓ సిగ్నల్ పంపినట్టు అనిపిస్తోంది. <<13711134>>అగ్నిపథ్ స్కీమ్<<>>ను ఎన్నికలకు ముందు ఇండియా కూటమి విమర్శించింది. రిజల్టు రాగానే JDU, LJP నేతలూ తిరిగి పరిశీలించాలన్నారు. స్కీమ్లో కేంద్రం మార్పులు చేస్తుందని బడ్జెట్ ముందు అనేక వార్తలు వచ్చాయి. అయితే అగ్నిపథ్ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆర్మీకిది అవసరమంటూ లద్దాక్ వద్ద ప్రధాని చేసిన ప్రసంగం వీటిని పటాపంచలు చేసింది.
Similar News
News November 14, 2025
18 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు: CBN

AP: కూటమి అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్లు CII సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇన్వెస్ట్మెంట్స్ రాబట్టగలిగామని వివరించారు. అటు రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు సంబంధించి లులూ గ్రూప్తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సీఎం CBN, లులూ ఛైర్మన్ యూసుఫ్ అలీ సమక్షంలో అధికారులు, సంస్థ ప్రతినిధులు అంగీకార పత్రాలు మార్చుకున్నారు.
News November 14, 2025
కలలు కంటూ ఉండండి.. బీజేపీకి టీఎంసీ కౌంటర్

బిహార్ ఎన్నికల్లో NDA విజయం నేపథ్యంలో BJP, తృణమూల్ కాంగ్రెస్ మధ్య SMలో మాటల యుద్ధం నడుస్తోంది. బిహార్ తర్వాత బెంగాల్ వంతు అని BJP చేసిన ట్వీట్కు TMC కౌంటర్ ఇచ్చింది. BJP కలలు కంటూనే ఉండాలనే అర్థం వచ్చేలా మీమ్ పోస్ట్ చేసింది. నీటి అడుగున కుర్చీలో అస్థిపంజరమున్న ఫొటో షేర్ చేస్తూ ‘బెంగాల్లో గెలుపు కోసం BJP ఇంకా ఎదురుచూస్తోంది’ అని ఎద్దేవా చేసింది. 2026లో బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
News November 14, 2025
రాహుల్, కేటీఆర్ ఐరన్ లెగ్స్: బండి

TG: బిహార్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పని ఖతమైందని, రాహుల్ గాంధీ ఇక పబ్జీ గేమ్కే పరిమితమవుతారని మంత్రి బండి సంజయ్ విమర్శించారు. KTR వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి BRS పతనం కొనసాగుతూనే ఉందన్నారు. దేశంలో రాహుల్, TGలో కేటీఆర్ ఐరన్ లెగ్స్ అని బండి ఎద్దేవా చేశారు. దేశం మొత్తం పోటీ చేస్తామని TRSను BRSగా మార్చిన కేసీఆర్ పత్తా లేకుండా పోయారని, చివరకు ఆ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీగా మారిందన్నారు.


