News May 2, 2024

TDPతో పొత్తుపై మోదీ కీలక వ్యాఖ్యలు

image

ఏపీలో TDPతో పొత్తు పెట్టుకోవడంపై PM మోదీ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘పొత్తును ఎన్నికలకు పరిమితం చేయొద్దు. దేశంలోని ప్రాంతీయ రాజకీయ ఆకాంక్షలకు సంపూర్ణ గౌరవం దక్కాలన్నది మా సిద్ధాంతం. అందుకే మాకు మెజార్టీ ఉన్నా TDPని చేర్చుకున్నాం. లాభనష్టాలను లెక్కలేసుకుని రాజకీయాలు చేయం. ఆచరణ సాధ్యమైన చోటే పొత్తులు కుదుర్చుకుంటాం. ఇటీవల CBN-పవన్‌తో కలిసి పెద్ద ర్యాలీలో పాల్గొన్నా’ అని పేర్కొన్నారు.

Similar News

News December 23, 2025

BREAKING: మాజీ MP ఆదికేశవులు కుమారుడు, కుమార్తె అరెస్ట్

image

మాజీ MP DK ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్, కుమార్తె కల్పజలను CBI అధికారులు సోమవారం అరెస్టు చేశారు. వ్యాపారవేత్త రఘునాథ్ మృతి కేసు విచారణలో అరెస్టు చేసినట్లు సమాచారం. 2019 మే 4వ తేదీన అనుమానాస్పద రీతిలో రఘునాథ్ మృతిచెందాడు. దీంతో రఘునాథ్ భార్య మంజుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాక్ష్యాలు నాశనం చేయడం, పత్రాల ఫోర్జరీ, ప్రభుత్వ స్టాంపులు, సీళ్లను సృష్టించడం వంటి వాటిపై CBI కేసు నమోదు చేసింది.

News December 23, 2025

పార్టీ, పదవుల కన్నా ప్రజలే ముఖ్యం: పవన్

image

AP: పార్టీ, పదవుల కన్నా నమ్మిన ప్రజలే తనకు ముఖ్యమని Dy.CM పవన్ అన్నారు. ‘పదవులు అలంకారం కాదు బాధ్యత. రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతానికి ప్రయత్నిస్తే సహించను. సంఘ విద్రోహులకు వైసీపీ కొమ్ము కాస్తోంది. అధికారులకు మళ్లీ చెబుతున్నా వైసీపీ మళ్లీ రాదు. పిల్లలకు కులాలను అంటగట్టి రాజకీయం చేస్తున్నారు. పిఠాపురం నుంచి పార్టీ నిర్మాణ ప్రక్రియకు శ్రీకారం చుట్టాం’ అని జనసేన పదవి-బాధ్యత కార్యక్రమంలో తెలిపారు.

News December 23, 2025

నరమాంస తోడేలు.. తల్లి ఒడిలోని బాలుడిని ఎత్తుకెళ్లి..

image

UPలో నరమాంస తోడేళ్లు స్వైరవిహారం చేస్తున్నాయి. తాజాగా బహ్రైచ్‌(D) రసూల్‌పూర్ దారెహ్తాలో దారుణం జరిగింది. తల్లి ఒడిలో కూర్చోబెట్టుకుని పాలు పడుతుండగా మూడేళ్ల చిన్నారి అన్షుని తోడేలు నోట కరుచుకుని పారిపోయింది. తల్లి దాని వెంట పడినప్పటికీ తెల్లవారుజామున కావడంతో ఆచూకీ దొరకలేదు. కొంతదూరంలో అన్షు మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు. ఆ జిల్లాలో తోడేళ్ల దాడిలో 12 మంది చనిపోగా 32 మంది తీవ్రంగా గాయపడ్డారు.