News February 3, 2025

ట్రంప్‌తో మోదీ భేటీ.. ఎప్పుడంటే?

image

PM మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో త్వరలో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రధాని ఈ నెల రెండోవారంలో ఫ్రాన్స్, అమెరికా పర్యటనలకు వెళ్లే అవకాశం ఉంది. ఆ సమయంలోనే ఆయన ఫిబ్రవరి 13న వాషింగ్టన్‌లో ట్రంప్‌తో భేటీ కానున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. మోదీతో సమావేశం నేపథ్యంలో ట్రంప్ డిన్నర్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. గత నెల 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

Similar News

News February 4, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* AP: భారత్‌వైపే ప్రపంచ దేశాల చూపు: CM CBN
* ప్రైవేట్ స్కూళ్ల గుర్తింపు గడువు పొడిగింపు: లోకేశ్
* పద్మభూషణ్ నాలో ఇంకా కసిని పెంచింది: బాలకృష్ణ
* TG: కులగణనపై సలహాలు, సూచనలు స్వీకరించేందుకు సిద్ధం: మంత్రి పొన్నం
* కులగణన నివేదిక ఫేక్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
* తెలంగాణలో 90 శాతం వెనుకబడిన వాళ్లే: రాహుల్ గాంధీ

News February 4, 2025

అప్పుడు రోహిత్.. ఇప్పుడు త్రిష

image

గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచాక భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గ్రౌండ్‌లో పడుకున్న ఫొటో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా అదే తరహాలో అండర్-19 WC గెలుచుకున్నాక త్రిష కప్ పట్టుకొని పడుకున్న ఫొటోను ముంబై ఇండియన్స్ షేర్ చేసింది. దీంతో పాటు 2024లో సెలబ్రేషన్స్ ఫొటోలను ఇతర ఫొటోలతో పోల్చింది. అప్పటి రోహిత్ సెలబ్రేషన్స్‌ను ఇప్పుడు త్రిష రీక్రియేట్ చేశారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

News February 4, 2025

శ్రీవారి భక్తులకు అలర్ట్

image

AP: రేపు రథసప్తమి కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులను సర్వదర్శనంలో అనుమతిస్తామని TTD EO శ్యామలరావు తెలిపారు. ఉ.5.30కు సూర్యప్రభ వాహన సేవతో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఉ.9-10 వరకు చిన్న శేష వాహన సేవ, ఉ.11-12 వరకు గరుడ వాహన సేవ, మ.1-2 వరకు హనుమంత వాహన సేవ, మ.2-3 వరకు చక్రస్నానం, సా.4-5 వరకు కల్పవృక్ష వాహన సేవ, సా.6-7 వరకు సర్వభూపాల వాహన సేవ, రా.8-9 వరకు చంద్రప్రభ వాహన సేవతో వేడుకలు ముగుస్తాయి.