News June 18, 2024

NEETపై మోదీ మౌనం.. రాహుల్ విమర్శలు

image

NEET వ్యవహారంలో ప్రధాని మోదీ మౌనంగా ఉండటంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. బిహార్, గుజరాత్, హరియాణాల్లోనే అరెస్టులు జరిగాయని, పేపర్ లీకులకు BJP పాలిత రాష్ట్రాలు కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. 24లక్షల విద్యార్థుల భవిష్యత్తు తారుమారవుతున్నా మోదీ ఎప్పటిలాగే మౌనం వహిస్తున్నారన్నారు. తమ పార్టీ పేపర్ లీకులకు వ్యతిరేకంగా కఠిన చట్టాలను రూపొందించేలా మేనిఫెస్టోలో పెట్టిందన్నారు.

Similar News

News November 20, 2025

KMR: NPYAD పథకం కింద గ్రాంట్ ఇన్ ఎయిడ్ దరఖాస్తులకు ఆహ్వానం

image

2025-26 సం.రానికి గాను జాతీయ యువత, కౌమార దశ అభివృద్ధి కార్యక్రమం NPYAD పథకం కింద ఆర్థిక సహాయమందించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ నెల 30 లోపు ఎటువంటి లాభాపేక్ష లేని స్వచ్ఛంధ సంస్థల నుంచి ప్రతిపాదనలను ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ముందుగా http://NGO darpan.gov.inలో నమోదు చేసుకొని యూనిక్ దర్పన్ ఐడి పొందాలన్నారు. వివరాలకు కలెక్టరేట్‌లో సంప్రదించాలన్నారు.

News November 20, 2025

26న దేశవ్యాప్తంగా రైతుల నిరసనలు

image

రైతులు, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా(SKM) వెల్లడించింది. రైతుల ఢిల్లీ మార్చ్‌కు ఐదేళ్లు అవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ‘నాడు కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. MSP, రుణమాఫీ, విద్యుత్ ప్రైవేటీకరణ నిలుపుదల వంటి వాటిని పట్టించుకోలేదు’ అని ఆల్ ఇండియా కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ దవాలే మండిపడ్డారు.

News November 20, 2025

ఏపీ న్యూస్ అప్డేట్స్

image

*శ్రీకాకుళం(D) ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల మూలాలపై పరిశోధన చేసేందుకు ICMR ఆమోదం తెలిపింది. మూడేళ్లలో పరిశోధన పూర్తి చేసేందుకు రూ.6.2 కోట్లు ఇవ్వనుంది: మంత్రి సత్యకుమార్
*వైసీపీ పథకాన్ని చంద్రబాబు కాపీ కొట్టారు. జ‌గ‌న్ చేసిన మంచి ప‌నుల‌కు త‌న స్టాంప్ వేసుకుని క్రెడిట్ చోరీ చేయాల‌ని ఆలోచిస్తున్నాడు: కన్నబాబు
*ఇవాళ బిహార్ CMగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారానికి వెళ్లనున్న CM చంద్రబాబు, మంత్రి లోకేశ్.