News October 12, 2024
OTTలపై మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు

దేశంలో OTTలలో చూపుతున్న కంటెంట్ నైతిక అవినీతి (Moral Corruption)కి కారణమవుతోందని, వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని RSS చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. ‘OTTలలో చూపే విషయాలు అసహ్యంగా ఉంటాయి. వాటి గురించి మాట్లాడినా అసభ్యకరంగా ఉంటుంది. నైతిక అవినీతికి ఇదీ ఒక కారణం. కాబట్టి దీన్ని చట్ట ప్రకారం నియంత్రించాలి. సోషల్ మీడియా ఉన్నది అశ్లీలత, అసభ్యత వ్యాప్తి చేయడానికి కాదు’ అని పేర్కొన్నారు.
Similar News
News December 18, 2025
పట్టు రైతులకు రూ.14 కోట్లు విడుదల

AP: రాష్ట్రంలో పట్టు పరిశ్రమపై ఆధారపడిన రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2023-24, 2024-25 సంవత్సరాలకు సంబంధించి సిల్క్ సమగ్ర-2 పథకంలో భాగంగా రాష్ట్ర వాటా కింద రూ.14 కోట్ల నిధుల్ని పట్టు పరిశ్రమల శాఖకు విడుదల చేశామని మంత్రి వెల్లడించారు. ఈ నిధుల విడుదలతో 13,663 మంది పట్టు రైతులకు లబ్ధి చేకూరినట్లు మంత్రి అచ్చెన్న తెలిపారు.
News December 18, 2025
రేషన్ కార్డుదారులకు అలర్ట్

TG: రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది. లేదంటే కొత్త సంవత్సరంలో సన్న బియ్యం కోటా నిలిపివేస్తామని ఆదేశాలు జారీ చేసింది. కార్డుల్లో ఉన్న వారు రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ యంత్రంలో వేలిముద్రలు వేసి కేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పింది. ఐదేళ్ల లోపు పిల్లలకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది.
News December 18, 2025
హిల్ట్ పాలసీలో సవరణలకు ప్రభుత్వ యోచన

TG: HILT పాలసీలో కొన్ని సవరణలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 22 పారిశ్రామిక పార్కులలోని కంపెనీల యాజమాన్యాలు భూములను నివాస ప్లాట్లుగా మార్చడానికి దరఖాస్తు చేసుకోకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. త్వరలో వాటితో సమావేశం ఏర్పాటు చేసి పాలసీలో ప్రస్తుతం సవాలుగా ఉన్న సమస్యలపై చర్చిస్తామని ఉన్నతాధికారి ఒకరు ‘వే2న్యూస్’కు తెలిపారు. అవసరమైతే వారి అవసరాలకు అనుగుణంగా పాలసీలో మార్పులు చేస్తామని చెప్పారు.


