News March 13, 2025

రాష్ట్ర పండుగగా మొల్ల జయంతి

image

AP: తొలి తెలుగు కవయిత్రి మొల్ల జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్లు, రాష్ట్ర సచివాలయంలో మొల్ల జయంతిని నిర్వహించాలని పేర్కొంది. వైఎస్సార్ కడప జిల్లాలోని బద్వేలు ప్రాంతానికి చెందిన మొల్ల 16వ శతాబ్దపు కవయిత్రి. మొల్ల రామాయణం ఎంతో ప్రసిద్ధి చెందింది.

Similar News

News January 24, 2026

84 ఏళ్ల డైరెక్టర్‌తో 74 ఏళ్ల హీరో సినిమా

image

మలయాళ ఇండస్ట్రీలో అరుదైన కాంబోలో మూవీ తెరకెక్కనుంది. లెజెండరీ డైరెక్టర్ అదూర్ గోపాలకృష్ణన్ 84 ఏళ్ల వయసులో మళ్లీ దర్శకత్వం చేయనున్నారు. 74 ఏళ్ల మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించనున్నారు. 32 ఏళ్ల క్రితం ‘విధేయన్’ వంటి క్లాసిక్ తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. ‘పాదయాత్ర ’ పేరుతో ఈ కొత్త సినిమా తెరకెక్కనుంది. తెలుగులో మమ్ముట్టి ‘యాత్ర’లో నటించిన విషయం తెలిసిందే.

News January 24, 2026

న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం

image

U19-WCలో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. వర్షం ఆటంకం కలిగించడంతో DLS ప్రకారం 130 పరుగులకు కుదించిన <<18946505>>లక్ష్యాన్ని<<>> 13.3 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ ఆయుశ్ 27 బంతుల్లో 6 సిక్సర్లు, 2 ఫోర్లతో 53 రన్స్ చేయగా ఓపెనర్ వైభవ్ 23 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 40 రన్స్ చేశారు. వీరిద్దరు ఔటైనా మల్హోత్రా, త్రివేది జట్టును విజయతీరాలకు చేర్చారు. NZ బౌలర్లలో క్లర్క్, సంధు, సంజయ్ తలో వికెట్ తీశారు.

News January 24, 2026

సింగరేణి రికార్డులను సీజ్ చేయాలి: మంత్రి సంజయ్

image

TG: ఉమ్మడి APలో కన్నా ప్రస్తుత BRS, INC పాలనలోనే సింగరేణి ఎక్కువ దోపిడీకి గురైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అక్రమాలకు సంబంధించి రికార్డులు తారుమారయ్యే ప్రమాదం ఉందని, వాటిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ‘ఫోన్ ట్యాపింగ్ కేసులో KTRను సాక్షిగా పిలిచామని మంత్రులు అంటుంటే విచారణకు పిలిచామని సజ్జనార్ చెబుతున్నారు. ఏది నిజం? KTR, KCRలకు ప్రభుత్వం క్లీన్ చిట్ ఇస్తోందా?’ అని ప్రశ్నించారు.