News April 10, 2025
‘అమ్మ నన్ను చంపేస్తోంది’.. అని మెసేజ్ చేసి..

AP: తిరుపతి(D) చంద్రగిరి(M)లో బాలిక అనుమానాస్పద<<16045416>>మృతిపై <<>>ఆమె ప్రియుడు అజయ్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ‘మూడేళ్లు ప్రేమించుకుని గతేడాది పెళ్లి చేసుకున్నాం. ఆమె పేరెంట్స్ నాపై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపారు. గర్భం దాల్చిన బాలికకు అబార్షన్ చేయించారు. విషం పెట్టి వాళ్ల అమ్మ, మామ, తాత చంపాలని చూస్తున్నారని ఆమె మెసేజ్ చేసింది. తర్వాతి రోజే చనిపోయింది’ అంటూ బాలికతో చేసిన చాటింగ్ను పంచుకున్నాడు.
Similar News
News April 18, 2025
భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో వీటికి చోటు దక్కింది. ఇది ప్రపంచంలోని ప్రతీ భారతీయుడికి గర్వకారణమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారతీయ సంస్కృతికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చిందన్నారు. భగవద్గీత, నాట్యశాస్త్రం శతాబ్దాలుగా దేశ నాగరికతను, చైతన్యాన్ని పెంపొందించాయని పేర్కొన్నారు.
News April 18, 2025
ఏసుక్రీస్తు త్యాగాన్ని గుర్తుచేసుకోవాలి: PM మోదీ

గుడ్ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులనుద్దేశించి ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ పవిత్ర రోజున ఏసుక్రీస్తు త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలన్నారు. ఆయనలోని దయ, కరుణ, క్షమాపణ వంటి సద్గుణాలు మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని చెప్పారు. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు సైతం క్రీస్తు గొప్పతనాన్ని గుర్తు చేశారు. తన శరీరంలోకి మేకులు దించిన సమయంలో కూడా ఏసుక్రీస్తు శాంతిని ప్రబోధించారన్నారు.
News April 18, 2025
రేపు జేఈఈ మెయిన్ ఫలితాలు: NTA

జేఈఈ మెయిన్-2025 సెషన్-2 ఫలితాలను రేపు వెల్లడిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా ప్రకటించింది. ఫైనల్ ఆన్సర్ కీలను ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అధికారిక <