News March 26, 2025
అమ్మలూ.. హ్యాపీ బర్త్డే: NTR

టాలీవుడ్ స్టార్ హీరో Jr.NTR తన సతీమణి లక్ష్మీ ప్రణతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో తీసుకున్న ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ‘అమ్మలూ.. హ్యాపీ బర్త్ డే’ అని విషెస్ తెలియజేశారు. ‘దేవర’ సినిమా రిలీజ్ సందర్భంగా వీరు ప్రస్తుతం జపాన్లో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి వివాహం 2011లో జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు అభయ్ రామ్, భార్గవ రామ్ ఉన్నారు.
Similar News
News March 26, 2025
9,970 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 9,970 ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 10 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. దరఖాస్తు ఫీజు జనరల్/OBCలకు రూ.500, మిగతావారికి రూ.250గా ఉంది. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉన్నవారిని అర్హులుగా పేర్కొంది. సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. అప్లికేషన్లకు చివరి తేదీ మే 9.
www.indianrailways.gov.in
News March 26, 2025
శ్రేయస్ ఆటతీరుపై మాజీ క్రికెటర్ ప్రశంసలు

PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆటతీరుపై మాజీ క్రికెటర్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించారు. గత ఏడాది కాలంలో అయ్యర్ తన ఆటను అద్భుతంగా మెరుగుపర్చుకున్నాడన్నారు. ప్రస్తుతం అతను అన్ని ఫార్మాట్లకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కొన్ని ఇష్యూస్ తర్వాత ఆటను ఇంప్రూవ్ చేసుకున్న తీరు గొప్పగా ఉందని పేర్కొన్నారు. నిన్న గుజరాత్తో మ్యాచ్లో అయ్యర్ 97* పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
News March 26, 2025
బాత్రూమ్లో ఎంతసేపు ఉంటున్నారు?

కొందరు అరగంట సేపైనా బాత్రూమ్లోనే ఉండిపోతూ కాలక్షేపం చేస్తుంటారు. టాయిలెట్ కమోడ్పై కూర్చొని రీల్స్ చూస్తుంటారు. ఇలా ఎక్కువ సేపు ఒకేచోట కూర్చోవడంతో పాయువు దగ్గర కండరాలపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల మలబద్ధకం, ఇన్ఫెక్షన్లు రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. టాయిలెట్లో ఎక్కువ సేపు ఫోన్ చూడటంతో మెడ, వెన్ను నొప్పి, తిమ్మిర్లు వస్తాయి. అందుకే వెళ్లిన పనిని త్వరగా కానిచ్చి బయటపడాలంటున్నారు.