News February 16, 2025
తొలిసారి 5 స్టార్ హోటల్లో మోనాలిసా భోజనం

తన కళ్లతో కుంభమేళాలో అందరినీ ఆకర్షించి రాత్రికి రాత్రే స్టార్గా మారిపోయింది మోనాలిసా. ఇటీవల తొలిసారి ఫ్లైట్ ఎక్కిన ఆమె, తాజాగా ఫస్ట్ టైం 5 స్టార్ హోటల్కు వెళ్లింది. తన కుటుంబ సభ్యులతో కలిసి అందులో భోజనం చేసింది. ఆమె నటిస్తున్న మూవీ డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాను ఇక్కడకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కుటుంబంతో కలిసి 5 నక్షత్రాల హోటల్లో మోనాలిసా ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Similar News
News December 26, 2025
నేటి ముఖ్యాంశాలు

✬ AP: వాజ్పేయి ఒక యుగ పురుషుడు: చంద్రబాబు
✬ వైద్య రంగంలో PPPతోనే మేలు: నడ్డా లేఖ
✬ తల్లి విజయమ్మతో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్
✬ ఇద్దరు TG మంత్రులు జైలుకెళ్లడం ఖాయం: బండి సంజయ్
✬ రేవంత్ను చెట్టుకు కట్టేసి కొట్టాలి: హరీశ్ రావు
✬ వరుస సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలకు పోటెత్తిన భక్తులు
✬ బంగ్లాదేశ్లో మరో హిందూ యువకుడి హత్య
News December 26, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ముగిసిన ప్రభాకర్రావు కస్టడీ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్రావు కస్టోడియల్ విచారణ ముగిసింది. 14 రోజుల పాటు సిట్ విచారించింది. రేపు ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనుండగా, అనంతరం ఇంటికి వెళ్లనున్నారు. ఆయన స్టేట్మెంట్ను ఫైనల్ ఛార్జ్షీట్లో పొందుపరచనున్న సిట్ JAN 16వ తేదీ తర్వాత సుప్రీంకోర్టుకు నివేదిక అందించనుంది. అటు తాను చట్టప్రకారం వ్యవహరించానని, ఎలాంటి తప్పు చేయలేదని ప్రభాకర్రావు చెప్పారు.
News December 26, 2025
రాష్ట్రంలో IASల బదిలీలు, పోస్టింగులు

TG: పలువురు IASలను బదిలీ చేస్తూ, మరికొందరికి పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రోపాలిటన్ ఏరియా & డెవలప్మెంట్(HMDA పరిధి) ప్రత్యేక సీఎస్గా జయేశ్ రంజన్ను నియమించింది. ఈయన పర్యాటక ప్రత్యేక సీఎస్గా కొనసాగనున్నారు. అలాగే సిరిసిల్ల కలెక్టర్ హరితను TGPSC కార్యదర్శిగా బదిలీ చేసింది. అటు మరికొందరు ఐఏఎస్లను GHMC జోన్లకు కమిషనర్లుగా నియమించింది.


