News April 2, 2025
ఆయిల్ పామ్ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

TG: రాష్ట్రవ్యాప్తంగా 45,548 మంది ఆయిల్ పామ్ రైతుల ఖాతాల్లో ప్రత్యేక సబ్సిడీ డబ్బులను జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇందుకోసం మొత్తం ₹72crను విడుదల చేశామన్నారు. సబ్సిడీ కింద ప్రభుత్వం ఎకరాకు ₹50వేలకు పైగా అందిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2.34 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అవుతోంది. 2023లో మార్చిలో టన్ను గెల ధర ₹14,174గా ఉండగా, ప్రస్తుతం ₹21,000కు చేరిందని మంత్రి తెలిపారు.
Similar News
News December 25, 2025
RO-KO సెంచరీల మోత.. ఇంకా నిరూపించుకోవాలా?

2027 వరల్డ్ కప్ లక్ష్యంగా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేల్లో ఆడుతున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్లలో చెలరేగి ఆడారు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో <<18664717>>సెంచరీలతో<<>> అదరగొట్టారు. సూపర్ ఫిట్నెస్తో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరూ ఇంకా <<18575287>>నిరూపించుకోవాల్సింది<<>> ఏమైనా ఉందా అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. WC ఆడకుండా RO-KOను ఆపేదెవరని అంటున్నారు. మీరేమంటారు?
News December 25, 2025
ఇంజినీరింగ్ ఫీజుల్లో మార్పులు.. జీవో జారీ

AP: హైకోర్టు తుది తీర్పుకు అనుగుణంగా ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు చేస్తూ ఉన్నత విద్యాశాఖ జీవో విడుదల చేసింది. దీని ప్రకారం కనిష్ఠంగా రూ.40వేల నుంచి గరిష్ఠంగా రూ.1.05 లక్షల వరకు ఫీజు ఉండనుంది. 7 కాలేజీలకు మాత్రమే స్వల్పంగా ఫీజులు పెరిగాయి. ఫీజురీయింబర్స్మెంట్ పథకం కింద అడ్మిషన్లు పొందిన వారికి 2024-25 నుంచి మూడేళ్ల కాలానికి ఇవే ఫీజులు అమలవుతాయి. కాగా గతంలో కనీస ఫీజు రూ.43వేలుగా ఉండేది.
News December 25, 2025
గర్భనిరోధక మాత్రలతో బరువు పెరుగుతారా?

గర్భనిరోధక మాత్రల వల్ల శరీరంలో కొన్ని రకాల ద్రవాలు నిలిచిపోవడం, శరీరంలో నీటి పరిమాణం పెరగడం వల్ల కాస్త బరువు పెరగవచ్చు. అంతే కాకుండా కొవ్వు లేదా కండర ద్రవ్యరాశి పెరగడానికి కూడా ఇది కారణం అవుతుంది. మరోవైపు కొంతమంది మహిళలు ఈ టాబ్లెట్ తీసుకునేటప్పుడు బరువు కూడా తగ్గుతారు. ఈ టాబ్లెట్ యొక్క ఉపయోగాలు, ప్రయోజనాలు, దుష్ప్రభావాల గురించి మరింత సమాచారం కావాలంటే వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.


