News January 3, 2025

ఇవాళ అకౌంట్లోకి డబ్బులు: ప్రభుత్వం

image

TG: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవాళ పూర్తి స్థాయిలో వేతనాలు జమ అవుతాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. 1వ తేదీన సాంకేతిక కారణాలతో జీతాలు జమ కాలేదని చెప్పింది. సమస్యలను పరిష్కరించి నిన్నటి నుంచి జమ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది. పలువురి ఖాతాల్లో గురువారం రాత్రి జమ కాగా, మిగతా వారికి ఇవాళ డబ్బులు పడనున్నాయి. కాగా జనవరి 1న సెలవు కావడంతో జీతాలు జమ కాలేదనే ప్రచారం జరిగింది.

Similar News

News January 26, 2026

ఇల్లు/షాప్ ముందు ఎలాంటి గుమ్మడికాయ కట్టాలి?

image

దిష్టి తగలకుండా కట్టే గుమ్మడికాయ విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. దానికి తొడిమ తప్పనిసరిగా ఉండాలి. తొడిమ ఊడిపోయిన దానిని కట్టకూడదు. దీనిని ఇంటికి తెచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బోర్లించకూడదు. తొడిమ పైకి ఉండేలా పట్టుకుని రావాలి. అలాగే గుమ్మడికాయను నీటితో కడగడం నిషిద్ధం. అలా చేస్తే దానికున్న శక్తి తగ్గిపోతుందని అంటారు. కడగకుండానే పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. సూర్యోదయానికి ముందే కట్టాలి.

News January 26, 2026

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సంతోష్‌రావుకు సిట్ నోటీసులు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో BRS మాజీ ఎంపీ సంతోష్‌రావుకు సిట్ నోటీసులిచ్చింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు HYD జూబ్లీహిల్స్‌లోని పీఎస్‌లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇటీవల బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్‌లను సిట్ విచారించిన విషయం తెలిసిందే. అటు రేపటి విచారణకు హాజరై, సిట్ ప్రశ్నలకు సమాధానం చెబుతానని సంతోష్‌రావు తెలిపారు.

News January 26, 2026

కట్టె జనుము పంటకు ఈ దశలో నీటి తడులు తప్పనిసరి

image

వరి మాగాణిలో కట్టె జనుము పంటను సాగు చేస్తే మొదటి తడి అవసరం లేకుండా విత్తనాలు మొలకెత్తుతాయి. అయితే పంట మొలిచాక తొలి దశలో అనగా 25 రోజులకు, పూత, విత్తనం ఏర్పడే దశలో పంటను నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. అవసరాన్ని బట్టి పంట కాలంలో రెండు నుంచి 3 నీటి తడులను అందిస్తే మంచి దిగుబడి సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.