News February 25, 2025
అకౌంట్లలో డబ్బులు.. సీఎం కీలక ప్రకటన

TG: మార్చి 31లోపు అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటివరకు 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు నిధులు జమ చేసింది. ఇకపై మిగతావారికీ అందజేస్తామని సీఎం వెల్లడించారు. కాగా తొలుత ఎకరం వరకు ఉన్న 17 లక్షల మందికి రూ.557.54Cr, రెండెకరాల వరకు ఉన్న 13.23 లక్షల మందికి రూ.1130.29Cr, మూడెకరాల వరకు ఉన్న 9.56 లక్షల మందికి రూ.1230.98Cr ఖాతాల్లో వేశారు.
Similar News
News February 25, 2025
అనైతిక లేఆఫ్స్: వెనక్కి తగ్గిన ఇన్ఫోసిస్!

ట్రైనీ ఇంజినీర్ల అసెస్మెంట్ టెస్టును ఇన్ఫోసిస్ నిరవధికంగా వాయిదా వేసింది. మైసూర్ క్యాంపస్లో 350 మందిని తొలగించిన కొన్ని రోజులకే ఈ నిర్ణయం తీసుకుంది. OCTలో కంపెనీ 1000 మందిని నియమించుకుంది. వారు 3 దఫాల్లో అసెస్మెంట్ క్లియర్ చేయకుంటే ఇంటికెళ్లాల్సిందే. మొన్న ట్రైనీలను తొలగించిన <<15417347>>తీరు<<>>, ఈ అంశం లేబర్ మినిస్ట్రీకి చేరడం, దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో కంపెనీ మూడో అటెంప్టు వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
News February 25, 2025
ముగ్గురిని చంపేసిన గజరాజులు.. కుంకీ ఏనుగులు ఎక్కడ?

AP: అన్నమయ్య (D)లో నేడు ఏనుగుల దాడిలో ముగ్గురు చనిపోయారు. అటు పార్వతీపురం మన్యం(D) జియ్యమ్మవలస(M)లో రైస్ మిల్లులోని ధాన్యం, బియ్యాన్ని గజరాజులు చెల్లాచెదురు చేశాయి. దీంతో కుంకీ ఏనుగులు ఎక్కడ? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రజలకు నష్టం జరగకుండా గజరాజులను కుంకీ ఏనుగులతో తరిమేస్తామన్న ప్రభుత్వం ఏం చేస్తోందని బాధితులు నిలదీస్తున్నారు. మరో ప్రాణం పోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News February 25, 2025
వంశీపై మరో కేసు

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరంలో తమ పేరిట ఉన్న రూ.10 కోట్ల విలువైన స్థలం కబ్జా చేశారని హైకోర్టు లాయర్ సతీమణి సుంకర సీతామహాలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వంశీతో పాటు మరో 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇప్పటికే జైలులో ఉన్న వంశీపై అక్రమ మైనింగ్, భూకబ్జాల ఆరోపణలపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.