News February 25, 2025
అకౌంట్లలో డబ్బులు.. సీఎం కీలక ప్రకటన

TG: మార్చి 31లోపు అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటివరకు 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు నిధులు జమ చేసింది. ఇకపై మిగతావారికీ అందజేస్తామని సీఎం వెల్లడించారు. కాగా తొలుత ఎకరం వరకు ఉన్న 17 లక్షల మందికి రూ.557.54Cr, రెండెకరాల వరకు ఉన్న 13.23 లక్షల మందికి రూ.1130.29Cr, మూడెకరాల వరకు ఉన్న 9.56 లక్షల మందికి రూ.1230.98Cr ఖాతాల్లో వేశారు.
Similar News
News December 14, 2025
100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు: TTD

AP: దేశంలో తొలిసారిగా ఆధ్యాత్మికత, పర్యావరణ పెంపు లక్ష్యంతో 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు TTD ఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. ‘హిందూ ఆలయాల్లో ధ్వజ స్తంభాలకు అవసరమైన టేకు, ఏగిశ, కినో, టెర్మినేలియా, షోరియా జాతి వృక్షాలు ఇందులో ఉంటాయి. దేశవ్యాప్తంగా TTD ఆధ్వర్యంలో ప్రస్తుతం 60 ఆలయాలున్నాయి. భవిష్యత్తులో వివిధ రాష్ట్రాల్లో మరిన్ని ఆలయాలు నిర్మించనున్నాం’ అని తెలిపారు.
News December 14, 2025
ఒక్క ఓటు తేడాతో స్వతంత్ర అభ్యర్థి గెలుపు

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్కంఠభరిత ఫలితాలు వెలువడ్డాయి. కామారెడ్డి (D) గాంధారి (M) పొతంగల్ఖుర్ద్లో పంచాయతీ ఎన్నిక కౌంటింగ్లో స్వతంత్ర అభ్యర్థి బెస్త సంతోష్ ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. సంతోష్కు 278 ఓట్లు, అతని సమీప ప్రత్యర్థికి 277 ఓట్లు వచ్చాయి. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం (D) అశ్వారావుపేట (M) పాత రెడ్డిగూడెంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి ఉమ్మలా వెంకటరమణ 2 ఓట్ల తేడాతో గెలుపొందారు.
News December 14, 2025
భారత్ బౌలింగ్.. బుమ్రా స్థానంలో హర్షిత్

సౌతాఫ్రికాతో ధర్మశాలలో జరిగే మూడో టీ20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. స్టార్ పేసర్ బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు.
భారత్: అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్ యాదవ్ (C), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, దూబే, జితేశ్ శర్మ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.


