News February 25, 2025

అకౌంట్లలో డబ్బులు.. సీఎం కీలక ప్రకటన

image

TG: మార్చి 31లోపు అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటివరకు 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు నిధులు జమ చేసింది. ఇకపై మిగతావారికీ అందజేస్తామని సీఎం వెల్లడించారు. కాగా తొలుత ఎకరం వరకు ఉన్న 17 లక్షల మందికి రూ.557.54Cr, రెండెకరాల వరకు ఉన్న 13.23 లక్షల మందికి రూ.1130.29Cr, మూడెకరాల వరకు ఉన్న 9.56 లక్షల మందికి రూ.1230.98Cr ఖాతాల్లో వేశారు.

Similar News

News November 28, 2025

ఆధార్ యాప్.. మొబైల్ నంబర్ ఇలా అప్‌డేట్ చేసుకోండి!

image

మొబైల్ యాప్ ద్వారా ఆధార్ కార్డుకు లింకైన <<18410970>>మొబైల్ నంబర్‌ను<<>> అప్‌డేట్ చేసుకునే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ప్లే స్టోర్‌లో ‘Aadhaar’ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని లాగిన్ కావాలి. My Aadhar Updatesపై క్లిక్ చేస్తే మొబైల్ నంబర్, అడ్రస్, పేరు, ఈమెయిల్ ఐడీ అప్‌డేట్స్ అని కనిపిస్తాయి. ప్రస్తుతానికి మొబైల్ నంబర్ అప్‌డేట్ మాత్రమే పని చేస్తోంది. రూ.75 చెల్లిస్తే 5 నిమిషాల్లో రిక్వెస్ట్ వెళ్తుంది.

News November 28, 2025

గంభీర్ తీరుపై బీసీసీఐ అసంతృప్తి.. ఇదే ఫైనల్ ఛాన్స్?

image

IND హెడ్ కోచ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇచ్చిన <<18393677>>స్టేట్‌మెంట్లపై<<>> BCCI అసంతృప్తితో ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ప్రస్తుతం అతనికి బోర్డు సపోర్ట్ ఉన్నప్పటికీ, స్వదేశంలో జరిగే T20 WC రిజల్ట్స్‌ను బట్టి అది మారొచ్చని తెలిపింది. 2026 AUG వరకు స్వదేశంలో టెస్టులు లేకపోవడంతో టెస్ట్ కోచ్ బాధ్యతల నుంచి ఇప్పట్లో తొలగించకపోవచ్చని అంచనా వేసింది. SAతో టెస్ట్ సిరీస్ ఓడిన అనంతరం గంభీర్‌పై విమర్శలొచ్చాయి.

News November 28, 2025

2027 WCకు రోహిత్, కోహ్లీ.. కోచ్ ఏమన్నారంటే?

image

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉందని టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ అభిప్రాయపడ్డారు. పెద్ద టోర్నీల్లో వారి అనుభవం జట్టుకు కీలకమని అన్నారు. శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉంటే కచ్చితంగా ఆడతారని తెలిపారు. కాగా గత ఆస్ట్రేలియా సిరీస్‌లో రోహిత్ రాణించిన విషయం తెలిసిందే. ఆదివారం నుంచి SAతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఆడనున్నారు.