News April 30, 2024

త్వరలో రైతుల అకౌంట్లో డబ్బులు

image

TG: వడగళ్లు, అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపులకు EC అనుమతి ఇచ్చినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. 10 జిల్లాల్లో 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా వేసిన అధికారులు.. త్వరలోనే చెల్లింపుల ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఎకరానికి ₹10వేల చొప్పున నష్టపోయిన రైతులకు ₹15.81 కోట్ల పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. అత్యధికంగా కామారెడ్డిలో 10,328 ఎకరాల్లో పంట నష్టం జరిగింది.

Similar News

News March 17, 2026

ఆధారాలివిగో.. KTR రాజీనామా చెయ్: సీతక్క

image

TG: మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా ₹57000 కోట్ల రుణాలు ఇచ్చినట్లు రిపోర్టులు చూపిస్తే రాజీనామా చేస్తానన్న KTR <<19406367>>సవాల్‌పై<<>> మంత్రి సీతక్క స్పందించారు. అందుకు సంబంధించిన ఆధారాలు విడుదల చేస్తూ… సవాల్‌కు కట్టుబడి KTR రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలకు ₹57000 కోట్లు రుణాలివ్వడమే కాకుండా వడ్డీ భారాన్నీ ప్రభుత్వమే భరిస్తోందన్నారు. ఇప్పటివరకు ₹1,390 కోట్లు వడ్డీ కింద చెల్లించామని వివరించారు.

News March 17, 2026

సెక్రటేరియట్ టవర్స్‌: AC, ఎలక్ట్రికల్, పంబ్లింగ్ వర్క్స్‌కు రూ.2316 కోట్లు

image

AP: అమరావతిలో నిర్మిస్తున్న సెక్రటేరియట్ టవర్స్‌లో హైసైడ్ ఎలక్ట్రికల్, HVAC, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్, లిఫ్ట్, ఫైర్ అలారమ్, పంబ్లింగ్ తదితర పనులకు రూ.2316.88 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం CRDAకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ GO ఇచ్చింది. GAD టవర్‌తో పాటు 1, 2, 3, 4 టవర్లలోని సదరు పనులకు ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. 53L చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ టవర్లను నిర్మిస్తున్నారు.

News March 17, 2026

బిల్లులో గ్యాస్ ఛార్జ్.. రూల్స్ ఏం చెబుతున్నాయి?

image

హోటల్ బిల్లులో ఫుడ్ ప్రైస్, GST తప్ప మరే ఇతర ఛార్జీలు వసూలు చేయడానికి వీల్లేదని వినియోగదారుల రక్షణ చట్టం (2019) చెబుతోంది. ఇటీవల ‘గ్యాస్ క్రైసిస్ ఛార్జ్’ పేరుతో అదనంగా వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సర్వీస్ ఛార్జ్ అయినా, మరే ఇతర పేరుతో అయినా కస్టమర్ అనుమతి లేకుండా ఎక్స్‌ట్రా డబ్బులు అడగొద్దు. పెరిగిన ఖర్చులను మెనూ ధరల్లో చూపించాలే తప్ప విడిగా యాడ్ చేయడం రూల్స్‌కు విరుద్ధం.