News August 22, 2025

త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు

image

AP: తల్లికి వందనం పథకం పెండింగ్ దరఖాస్తులకు మంత్రి లోకేశ్ ఆమోదం తెలిపారు. విద్యాశాఖపై సమీక్షించిన ఆయన ఈ పథకానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.325 కోట్లు రిలీజ్ చేసే ఫైలుపై సంతకం చేశారు. దీంతో త్వరలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ డబ్బులు జమకానున్నాయి. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఇకపై ఏటా DSC నిర్వహించి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి వెల్లడించారు.

Similar News

News August 22, 2025

ఎవరా లీకువీరుడు..?

image

TG సెక్రటేరియట్‌లో కొందరు హై లెవల్ అధికారులకు టెన్షన్ పట్టుకుంది. దీనికి కారణం.. PC ఘోష్ కమిషన్ రిపోర్టును KCR కోర్టులో సవాల్ చేయడం. కాళేశ్వరంపై ఘోష్ ఇచ్చిన 600పేజీల నివేదికను ప్రభుత్వం ప్రజలకు 60పేజీల సమ్మరీ రిపోర్టుగా రిలీజ్ చేసింది. అయితే KCR 600పేజీల కాపీతో HCకి వెళ్లడంతో ఆయనకు కాపీ ఎవరిచ్చారని CMO విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సంబంధిత IASలు ఆందోళనలో పడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

News August 22, 2025

నటుడికి భార్య విడాకులు?

image

నటుడు గోవింద-సునీత ఆహుజా దంపతులు విడాకులు తీసుకోనున్నట్లు బాలీవుడ్ వర్గాలు మరోసారి కోడై కూస్తున్నాయి. భర్తపై తీవ్ర ఆరోపణలు చేస్తూ బాంద్రా ఫ్యామిలీ కోర్టులో సునీత విడాకులకు అప్లై చేసినట్లు తెలిపాయి. భర్త తనను వేధిస్తున్నాడని, మోసం చేశాడని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నట్లు వెల్లడించాయి. కాగా గతంలోనూ వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరగగా సునీత <<15621494>>ఖండించారు<<>>. ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి.

News August 22, 2025

PHOTO: కాబోయే కోడలితో సచిన్ ఫ్యామిలీ?

image

సచిన్ కొడుకు అర్జున్‌కు సానియా చందోక్‌తో ఇటీవల ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు సచిన్ దీనిపై స్పందించలేదు. ఇవాళ ముంబైలో సారా తెందూల్కర్ ఫిట్‌నెస్ సెంటర్ ఓపెనింగ్‌కు సానియా హాజరయ్యారు. తెందూల్కర్ ఫ్యామిలీతో కలిసి ఆమె సెంటర్‌ను ప్రారంభించడం ఎంగేజ్మెంట్ వార్తలకు బలం చేకూరుస్తోంది. తర్వాత వారంతా కలిసి ఫొటోలు దిగారు. వీటిని స్వయంగా సచినే Xలో షేర్ చేశారు.