News October 23, 2024
24 గంటల్లోనే అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్: మంత్రి

AP: రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు ఖాతాలో జమ చేస్తామన్న మాటను నిలబెట్టుకున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తూ.గో.జిల్లా ధర్మవరానికి చెందిన రైతు నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లోనే నగదు జమ చేసినట్లు తెలిపారు. ‘ఇచ్చిన గడువు కంటే ముందే డబ్బులు చెల్లించాం. రైతులు, కౌలు రైతుల సంక్షేమం కోసం CM, Dy.CM ఆలోచన చేస్తున్నారనడానికి ఇదే తార్కాణం’ అని Xలో పేర్కొన్నారు.
Similar News
News December 27, 2025
₹240 కోట్లతో బాలామృతం.. నాణ్యత లోపిస్తే నష్టం

AP: 7 నెలల నుంచి 3 ఏళ్ల పిల్లలకు బాలామృతం కింద ₹240 CRతో న్యూట్రిషన్ పౌడర్, హెల్త్ మిక్స్ పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకు టెండర్లు పిలిచింది. పసివారికిచ్చే ఇవి నాణ్యతగా ఉండాలి. లేకుంటే దుష్ప్రభావం చూపుతాయి. అందుకే అనుభవమున్న కంపెనీలకే దీన్ని అప్పగించాలి. అయితే రాగి పిండి, చిక్కీలు తయారీ చేసే సంస్థలకు ఇచ్చేలా రూల్ మార్చారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటివరకు ‘TG ఫుడ్స్’ పౌడర్ ఇస్తున్నారు.
News December 27, 2025
‘ఫర్టిగేషన్’లో ఎరువులను ఎలా అందించాలి?

ఈ మధ్యకాలంలో రైతులు సేంద్రియ వ్యవసాయ పంటలకు జీవామృతం, వేస్ట్ డీకంపోజర్, వర్మీవాష్, జీవన ఎరువులను డ్రిప్ ద్వారానే అందిస్తున్నారు. జీవామృతాన్ని మాత్రం వడకట్టిన తర్వాత డ్రిప్ ద్వారా మొక్కలకు అందించాలి. రసాయన ఎరువులను డ్రిప్ ద్వారా అందిస్తే అన్ని మొక్కలకు సరైన మోతాదులో అందుతుంది. దీంతో పంట ఏకరీతిగా ఉంటుంది. ద్రవ రూపంలో నత్రజని, భాస్వరం, పొటాషియం మాత్రమే కాకుండా సూక్ష్మపోషక పదార్థాలను అందించవచ్చు.
News December 27, 2025
18ఏళ్లైనా న్యాయం జరగలేదు: ఆయేషా పేరెంట్స్

AP: తమ కూతురు ఆయేషా <<10606883>>మీరా<<>> హత్య జరిగి నేటికి 18 ఏళ్లు గడిచినా ఇంకా న్యాయం జరగలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో సీబీఐ, సిట్ విఫలమయ్యాయని మహిళా కమిషన్ను కలిసి ఫిర్యాదు చేశారు. సీబీఐ విచారణ కూడా సరిగ్గా చేయలేదని ఆరోపించారు. సామాన్యులకు న్యాయం జరగదని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పారు. డిసెంబర్ 27ను ఆయేషా మీరా సంస్మరణ దినంగా ప్రకటించాలని వినతిపత్రంలో కోరారు.


