News June 18, 2024
నేడు రైతుల అకౌంట్లలోకి డబ్బులు
ప్రధాని మోదీ నేడు 17వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. వారణాసిలో పర్యటించనున్న ఆయన 9.26 కోట్ల మంది రైతుల అకౌంట్లలో రూ.20 వేల కోట్లు జమ చేయనున్నారు. దీంతో పాటు 30వేలకు పైగా స్వయం సహాయక బృందాలకు మోదీ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. కాగా రైతులకు కేంద్రం ఏటా మూడు విడతల్లో రూ.6వేలు నగదు సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే.
Similar News
News October 7, 2024
డబ్బులు లేవంటూ ఈ సోకులు ఎవరికోసం?: KTR
TG: ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన ఆగదన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్పై మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. మింగ మెతుకు లేదు కానీ, మీసాలకు సంపెంగ నూనె కావాలన్నట్టు రేవంత్ వైఖరి ఉందని మండిపడ్డారు. పొద్దున లేస్తే రాష్ట్రం అప్పులపాలైందని, డబ్బులు లేవని అరిచిన రేవంత్.. మూసీ పేరిట రూ.లక్షా యాభైవేల కోట్ల సోకులు, ఆర్భాటం ఎవరికోసమని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.
News October 7, 2024
ఇన్వెస్టర్లను షేక్ చేస్తున్న Stock Markets
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లను షేక్ చేస్తున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి ఉదయం పాజిటివ్ సిగ్నల్స్ రావడంతో మెరుగ్గా ఓపెనైన సూచీలు క్రమంగా పతనమయ్యాయి. ప్రస్తుతం NSE నిఫ్టీ 314 పాయింట్ల నష్టంతో 24,700, BSE సెన్సెక్స్ 907 పాయింట్లు తగ్గి 80,780 వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు రూ.4 లక్షల కోట్ల మేర సంపద కోల్పోయారు. NSEలో 2322 షేర్లు పతనమవ్వగా 239 పెరిగాయి. అన్ని రంగాల సూచీలూ డౌన్ అయ్యాయి.
News October 7, 2024
New Study: గుండ్రని పొట్ట గుండెకు చేటు
పొట్ట ఎంత ఎక్కువ గుండ్రంగా ఉంటే గుండె జబ్బులు అంత ఎక్కువగా వస్తాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్లో ఓ కథనం పేర్కొంది. BMIతో పోలిస్తే BRI (బాడీ రౌండ్ ఇండెక్స్) మరింత మెరుగ్గా వీటిని అంచనా వేస్తుందని తెలిపింది. ఆరేళ్లకు పైగా ఎక్కువ BRI ఉంటే ముప్పు 163% వరకు పెరుగుతుందని హెచ్చరించింది. BRIలో హైట్, వెయిట్తో పాటు పొట్ట చుట్టుకొలతా తీసుకుంటారు. ఒబెసిటీతో BP, షుగర్, గుండె జబ్బులు రావడం తెలిసిందే.