News March 22, 2024

నేడు అకౌంట్లోకి డబ్బులు

image

TG: రైతుబంధు డబ్బులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శుభవార్త చెప్పారు. 5 ఎకరాల వరకు రైతుబంధు నగదును ఇవాళ జమ చేస్తామని వెల్లడించారు. అటు ధరణి పేరుతో బీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడిందని.. ఎంపీ జోగినపల్లి సంతోష్ 23 ఎకరాలను తన పేరుపై అక్రమంగా మార్చుకున్నారని తెలిపారు. చాలామంది బీఆర్ఎస్ లీడర్లు వందల ఎకరాల భూమిని తమ పేరు మీదకు మార్చుకున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News November 17, 2025

సౌదీలో ఘోర ప్రమాదం.. 42 మంది మృతి

image

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కాలో ప్రార్థనలు ముగించుకుని మదీనాకు వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి 42 మంది యాత్రికులు సజీవదహనమయ్యారు. ఇందులో 20 మంది మహిళలు, 11 మంది పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ముఫరహత్ వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది.

News November 17, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* కడప జిల్లాలోని పుష్పగిరిలో 13వ శతాబ్దానికి చెందిన శాసనాలను పురావస్తు శాఖ గుర్తించింది.
* కల్తీ నెయ్యి కేసులో నిందితుడైన A24 చిన్న అప్పన్నను నేటి నుంచి 5 రోజులపాటు సిట్ విచారించనుంది. ఇదే కేసులో TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డి ఈ నెల 19/20న విచారణకు హాజరుకానున్నారు.
* TTD మాజీ ఏవీఎస్‌వో సతీశ్ మృతి కేసును గుత్తి రైల్వే పోలీసుల నుంచి తాడిపత్రి పోలీసులకు బదిలీ చేయాలని అధికారులు నిర్ణయించారు.

News November 17, 2025

SAILలో 124 పోస్టులు.. అప్లై చేశారా?

image

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL)లో 124 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీ 65% మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు DEC 5వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1050, SC, ST, PwBDలకు రూ.300 వెబ్‌సైట్: www.sail.co.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.