News March 22, 2024
నేడు అకౌంట్లోకి డబ్బులు

TG: రైతుబంధు డబ్బులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి శుభవార్త చెప్పారు. 5 ఎకరాల వరకు రైతుబంధు నగదును ఇవాళ జమ చేస్తామని వెల్లడించారు. అటు ధరణి పేరుతో బీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడిందని.. ఎంపీ జోగినపల్లి సంతోష్ 23 ఎకరాలను తన పేరుపై అక్రమంగా మార్చుకున్నారని తెలిపారు. చాలామంది బీఆర్ఎస్ లీడర్లు వందల ఎకరాల భూమిని తమ పేరు మీదకు మార్చుకున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News April 17, 2025
మే 8న ఏపీ క్యాబినెట్ భేటీ

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మే 8న ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది. ఉ.11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. మే 6 సాయంత్రంలోగా మంత్రివర్గ భేటీలో చర్చించే అంశాలపై ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చారు. తల్లికి వందనం ఇతర పథకాల అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.
News April 17, 2025
BREAKING: డీఎస్సీకి వయోపరిమితి పెంపు

AP: రాష్ట్రంలో డీఎస్సీ-2025కి వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గరిష్ఠ వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచింది. కటాఫ్ తేదీని 2024 జులై 1గా నిర్ధారించింది. ఈ డీఎస్సీకి మాత్రమే వయోపరిమితి పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది.
News April 17, 2025
ఆ స్టార్ హీరోకు 17 ఏళ్లలో బిగ్గెస్ట్ ఫ్లాప్!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద వరుస పరాజయాలు చవిచూస్తున్నారు. మురుగదాస్ డైరెక్షన్లో రష్మిక హీరోయిన్గా భారీ అంచనాలతో మార్చి 30న విడుదలైన ‘సికందర్’ ఫ్యాన్స్ను మెప్పించలేకపోయింది. సుమారు రూ.200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ రూ.177 కోట్లే వసూలు చేసిందని సినీ వర్గాలు తెలిపాయి. యువరాజ్(2008) తర్వాత సల్మాన్ కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ ఫ్లాప్ అని పేర్కొన్నాయి.