News September 7, 2024
నేడు ఖమ్మం వరద బాధితుల ఖాతాల్లోకి డబ్బులు

TG: ఖమ్మం జిల్లాలోని వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నేటి నుంచి పరిహారం అందజేయనుంది. అధికారులు 3 రోజులపాటు సర్వే నిర్వహించి జిల్లావ్యాప్తంగా బాధితులను గుర్తించారు. సుమారు 22వేల కుటుంబాలు బాధితులుగా గుర్తించినట్లు సమాచారం. సీఎం రేవంత్ ఇచ్చిన హామీ మేరకు వీరందరికీ రూ.10వేల చొప్పున ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ ప్రక్రియ 3 రోజుల్లో ముగియనుంది.
Similar News
News February 4, 2026
DANGER: పచ్చి ఉల్లిపాయలు తింటున్నారా?

బిర్యానీతో పాటు పచ్చి ఉల్లిపాయలు కలిపి తింటే టేస్ట్ అదిరిపోతుంది కదా. కానీ వాటిని సరిగా శుభ్రం చేయకపోతే గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి, సిస్టిక్ సిర్రోసిస్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. అలాగే గుండెల్లో మంట, నోటి దుర్వాసన వస్తాయి. కాబట్టి వీటిని తినే ముందు శుభ్రంగా కడిగి తినాలి. వీటిని తినడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి కాబట్టి మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
News February 4, 2026
సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ రిలీజ్

UPSC సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ 2026 విడుదలైంది. ఈ ఏడాది ఐఏఎస్, ఐపీఎస్ తదితర సర్వీసుల్లో మొత్తం 933 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇవాళ్టి నుంచి ఈనెల 24వ తేదీ 6PM వరకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ను <
News February 4, 2026
ప్రాజెక్టులకు రూ.18వేల కోట్లు బకాయి పెట్టారు: రామానాయుడు

AP: గత ప్రభుత్వం రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి రూ.18వేల కోట్లు బకాయి పెట్టిందని మంత్రి రామానాయుడు విమర్శించారు. YCP విధ్వంసంతో ఇరిగేషన్ శాఖ గాడి తప్పిందన్నారు. పోలవరం, హంద్రీనీవా, వెలిగొండ, గాలేరునగరి, పోలవరం ఎడమ ప్రధాన కాలువ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. ఖరీఫ్ ముగిసినా రిజర్వాయర్లలో నీరుందంటే చంద్రబాబు వాటర్ మేనేజ్మెంట్ వల్లే అని పేర్కొన్నారు.


