News July 30, 2024
నేడు అకౌంట్లలో డబ్బులు జమ

TG: రెండో విడత రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తొలి విడతలో ₹లక్ష లోపు దాదాపు 11.50 లక్షల మంది రుణాలను మాఫీ చేసింది. ఇందుకోసం ₹6,035 కోట్లు ఖర్చు చేసింది. రెండో విడతలో భాగంగా ₹లక్ష నుంచి ₹లక్షన్నర రుణాలను మాఫీ చేయనుంది. ఈ ప్రక్రియను CM రేవంత్ అసెంబ్లీ ఆవరణలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ దఫాలో దాదాపు 7 లక్షల మంది రైతులకు ₹7వేల కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.
Similar News
News November 20, 2025
ఇతిహాసాలు క్విజ్ – 72

ఈరోజు ప్రశ్న: కురుక్షేత్ర మహాసంగ్రామంలో అర్జునుడితో పోరాటం చేస్తున్నప్పుడు, కర్ణుడి రథ చక్రం నేలలో కూరుకుపోయింది. ఎంత ప్రయత్నించినా అది బయటకు రాలేదు. అందుకు కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 20, 2025
PDILలో 87 ఇంజినీర్ ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్(PDIL)లో 87 కాంట్రాక్ట్ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.pdilin.com
News November 20, 2025
గేదెలతో డెయిరీఫామ్ ఎందుకు భారమవుతోంది?

ఆవు పాలతో పోలిస్తే గేదె పాలకు రెట్టింపు ధర వస్తుంది. అయితే స్థానిక గేదె జాతుల్లో పాల దిగుబడి తక్కువగా ఉండటంతో ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు పాడి రైతులు. గేదెలు సకాలంలో ఎదకు రాకపోవడం, మూగ ఎద లక్షణాలు ఎక్కువగా ఉండటం, ఎక్కువ పాల దిగుబడినిచ్చే ముర్రా జాతి గేదెలు అధిక ధర ఉండటం.. అంత ధరపెట్టి కొన్నా మన వాతావరణంలో అవి ఎక్కువ పాలివ్వడకపోవడం, ఎద విషయంలో సమస్యల కారణంగా ఫామ్ నిర్వాహకులు నష్టపోతున్నారు.


