News January 21, 2025

APSRTCకి కాసుల వర్షం

image

AP: సంక్రాంతి పండుగ భారీ లాభాల్ని తెచ్చిపెట్టినట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఈ నెల 20న అత్యధికంగా రూ.23.71 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొంది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న 3 రోజుల పాటు రోజుకు రూ.20కోట్లకు పైగా ఖజానాలో జమయ్యాయని తెలిపింది. ఈ నెల 8 నుంచి 20 వరకు 9వేలకు పైగా ప్రత్యేక బస్సులు నడిపినట్లు వెల్లడించింది.

Similar News

News January 22, 2026

RITES లిమిటెడ్ 48 పోస్టులకు నోటిఫికేషన్

image

<>RITES<<>> లిమిటెడ్ 48 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి బీఈ/ బీటెక్, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గలవారు నేటి నుంచి ఫిబ్రవరి 26 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. FEB 23, 24తేదీల్లో హరియాణాలో, ఫిబ్రవరి 25, 26, 27 తేదీల్లో తిరువనంతపురంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://rites.com

News January 22, 2026

సీఎం రేవంత్‌తో మంత్రి లోకేశ్ భేటీ

image

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌ను శాలువాతో సత్కరించారు. ఇరు రాష్ట్రాల్లోని విద్యా సంస్కరణలు, ఐటీ అభివృద్ధి, స్కిల్ డెలవప్‌మెంట్‌పై తామిద్దరం చర్చించినట్లు లోకేశ్ తెలిపారు. కాగా దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబునూ సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉంది.

News January 22, 2026

భోజ్‌శాలలో సరస్వతీ పూజ, నమాజ్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్

image

ధార్‌(MP)లోని వివాదాస్పద భోజ్‌శాల కాంప్లెక్స్‌లో రేపు (జనవరి 23) వసంత పంచమి సరస్వతీ పూజ, నమాజ్ రెండూ జరుపుకొనేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి అవకాశమిచ్చింది. హిందువులు రోజంతా పూజలు నిర్వహించుకోవడానికి అనుమతించింది. ఇద్దరికీ వేర్వేరు దారులు ఉండేలా చూడాలని, ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలని సూచించింది.