News November 15, 2024
త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ: మంత్రి అచ్చెన్న

AP: వర్షాభావం వల్ల పలు జిల్లాల్లో 1.06లక్షల హెక్టార్లలో పంట నాశనమైందని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో తెలిపారు. ఇప్పటికే 54 కరవు మండలాలను ప్రకటించామన్నారు. 1.44లక్షల మంది రైతులు నష్టపోయారని చెప్పారు. పరిహారంగా రూ.159.2 కోట్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే రైతుల ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేస్తామని ప్రకటించారు. నష్టపోయిన వారికి రాయితీతో 47వేల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశామన్నారు.
Similar News
News December 1, 2025
14,967 ఉద్యోగాలు.. అప్లైకి 3రోజులే ఛాన్స్

కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయల్లో 14,967 (13,025 టీచింగ్, 1,942 నాన్ టీచింగ్) పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా మూడు రోజులే( DEC 4) సమయం ఉంది. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, ME, M.Tech, M.PEd, BCA, BE, B.Tech, CTET, B.PEd, B.LiSc, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్: kvsangathan.nic.in/ *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 1, 2025
కోహ్లీ 100 సెంచరీలు చేస్తారా?

SAపై నిన్న కోహ్లీ చెలరేగిన తీరు చూస్తే సచిన్ 100 సెంచరీల రికార్డును చేరుకోవడం కష్టం కాదేమో అని క్రీడా వర్గాల్లో టాక్ మొదలైంది. 2027 WCకు ముందు భారత్ ఇంకా 20 వన్డేలు ఆడనుంది. లీగ్లో ఫైనల్కు చేరితే మరో 5 నుంచి 10 మ్యాచులు ఆడే ఆస్కారం ఉంది. ప్రస్తుతం 83 శతకాలు బాదిన కోహ్లీ ఇక నుంచి ప్రతి 3 మ్యాచులకు 2 సెంచరీలు చేస్తే సచిన్ సరసన నిలిచే ఛాన్సుంది. మరి విరాట్ ఆ ఘనత సాధిస్తారా? మీ COMMENT.
News December 1, 2025
భారీ జీతంతో NTPCలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<


