News August 7, 2025

Monsoonలో మైసూరుకు వెళ్లే వారికి గుడ్ న్యూస్

image

Monsoonలో మైసూరుకు వెళ్లాలనుకునే వారికి రైల్వే అధికారులు గుడ్ న్యూస్ ప్రకటించారు. రేపటి నుంచి 30వ తేదీ వరకు మైసూరుకు ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్- మైసూరు ( 07033), మైసూరు నుంచి సికింద్రాబాద్ (07034) రైలు ప్రయాణికులను గమ్యం చేర్చనున్నాయి. అక్కడికి ప్రతీ సోమ, శుక్రవారాల్లో, సికింద్రాబాద్‌కు ప్రతీ మంగళ, శనివారాల్లో రైళ్లు బయలుదేరుతాయని సీపీఆర్‌వో తెలిపారు.

Similar News

News September 14, 2025

గచ్చిబౌలిలో గోడ కూలి ఒకరు మృతి.. నలుగురికి గాయాలు

image

గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని వట్టినాగులపల్లిలో ప్రమాదం జరిగింది. గోడ కూలి ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. స్థానికంగా కొత్తగా నిర్మిస్తున్న నూతన కన్వెన్షన్ సెంటర్‌కి చెందిన ప్రహరీ కూలి అక్కడే పని చేస్తున్న కూలీలపై పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 14, 2025

HYD: భాయ్.. ర్యాలీ‌లో మా సేవ మీ కోసం!

image

పాతబస్తీలో మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు మిరాజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. బండ్లగూడ అధ్యక్షుడు భరత్‌కుమార్ ముస్లిం సోదరుల కోసం మంచినీటి బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమానికి మరింత శోభను తీసుకొచ్చారు. మత సామరస్యం, సేవా దృక్పథానికి ప్రతీకగా నిలిచిన ఈ కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు ప్రశంసించారు.

News September 14, 2025

HYD: హనీ ట్రాప్‌లో యోగా గురువు

image

చేవెళ్లలో యోగా గురువు రంగారెడ్డిని హనీ ట్రాప్ చేశారు. ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తెలిసి ఆశ్రమంలో చేరిన ఇద్దరు మహిళలు సన్నిహితంగా ఉంటూ వీడియోలు తీశారు. ఇవి ప్రధాన నిందితుడు అమర్‌కు చేరగా.. అతడు బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడ్డాడు. ఇప్పటికే రంగారెడ్డి నుంచి రూ. 50 లక్షలు వసూలు చేశారు. మరో రూ.2 కోట్లు కావాలని వేధించడంతో బాధితుడు గోల్కొండ PSలో ఫిర్యాదు చేయగా హనీ ట్రాప్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు.