News June 2, 2024

APని తాకిన రుతుపవనాలు

image

AP: నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించాయి. సీమలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవి విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. తొలుత ఈ నెల 4-5 తేదీల్లో రుతుపవనాలు ఏపీని తాకుతాయని భావించగా.. ముందుగానే ప్రవేశించాయి.

Similar News

News September 7, 2025

పాలలో కొవ్వు శాతం తగ్గడానికి కారణాలు

image

* గేదె, ఆవు పాలకు మార్కెట్‌లో మంచి ధర రావాలంటే వాటిలోని కొవ్వు శాతమే కీలకం.
* పశువుల వయసు ఎక్కువగా ఉన్నప్పుడు, ఈత చివరి దశలో సాధారణంగానే పాలలో కొవ్వు శాతం తగ్గతుంది.
* అలాగే పశువులను అధిక దూరం నడిపించినప్పుడు, అవి ఎదలో ఉన్నప్పుడు, వ్యాధులకు గురైనప్పుడు కూడా ప్రభావం పడుతుంది.
* అకస్మాత్తుగా మేతను మార్చినప్పుడు, పచ్చిగడ్డి, ఎండుగడ్డి సమంగా ఇవ్వకపోవడం వల్ల కూడా వెన్నశాతం అనుకున్నంత రాదు.

News September 7, 2025

ఉసిరితో కురులు మురిసె

image

* వర్షాకాలంలో జుట్టు సమస్యలు తగ్గడానికి ఉసిరి ఎంతో మేలు చేస్తుంది
* ఎండు ఉసిరి ముక్కలను కొబ్బరి/బాదం నూనెతో తక్కువ మంట మీద వేడిచేసి, చల్లార్చి ఫిల్టర్ చేయాలి.
* ఈ నూనెను వారానికి 2, 3సార్లు తలకు మసాజ్ చేసి తేలికపాటి షాంపూతో స్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
* ఉసిరి పొడిని పెరుగు/కొబ్బరిపాలతో పేస్టులా తయారుచేసి కుదుళ్లకు అప్లై చేసుకోవాలి. 30ని. తర్వాత వాష్ చేసుకుంటే జుట్టు మృదువుగా మారుతుంది.

News September 7, 2025

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గత వారం ఏపీలోని విజయవాడ, గుంటూరులో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220 ఉండగా, ఇవాళ రూ.240కి విక్రయిస్తున్నారు. అటు హైదరాబాద్‌, కామారెడ్డిలో రూ.240గా ఉంది. వినాయక నిమజ్జనాలు ముగియడం, ఇవాళ ఆదివారం కావడంతో చికెన్ అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.