News October 10, 2024

మోపిదేవి పార్టీ మారడం బాధాకరం: జగన్

image

AP: రేపల్లె నియోజకవర్గ నేత మోపిదేవి వెంకట రమణ పార్టీ వీడటంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఆయన విషయంలో ఏనాడు తప్పు చేయలేదని, మోపిదేవి పార్టీ మారడం బాధాకరమని అన్నారు. మండలి రద్దు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు మోపిదేవిని రాజ్యసభకు పంపామని గుర్తు చేశారు. రాజకీయాల్లో కష్టాలు శాశ్వతం కాదని అన్నారు. తనను జైల్లో పెట్టినా ప్రజల ఆశీర్వాదంతో సీఎం అయ్యానని వ్యాఖ్యానించారు. దేవుడు మంచివైపు ఉంటాడని చెప్పారు.

Similar News

News October 10, 2024

టాటా రిక్వెస్ట్: మూడు రోజుల్లో పరిష్కరించిన మోదీ

image

2008లో బెంగాల్‌ నుంచి ప‌రిశ్ర‌మ‌లు త‌ర‌లించాల్సి వ‌చ్చిన‌ప్పుడు PM మోదీ 3 రోజుల్లోనే తమ స‌మ‌స్యను ప‌రిష్క‌రించారని ర‌త‌న్ టాటా గతంలో గుర్తు చేసుకున్నారు. అప్ప‌టి గుజ‌రాత్ CMగా ఉన్న మోదీ త‌మ‌ను ఆహ్వానించారని, స్థలం కేటాయిస్తే తప్పక వస్తామని చెప్పామన్నారు. అప్పుడు 3 రోజుల్లో స్థలం కేటాయిస్తామని చెప్పి మోదీ మాట నిలుపుకున్నారని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం కోసం ఆయ‌న నిజాయితీగా ప‌నిచేశార‌న్నారు.

News October 10, 2024

బ్రూక్&రూట్.. WORLD RECORD

image

పాక్‌తో తొలి టెస్టులో అదరగొట్టిన బ్రూక్(317), రూట్(262) వరల్డ్ రికార్డ్ సాధించారు. విదేశీ గడ్డపై ఏ వికెట్‌కైనా అత్యధిక పార్ట్‌నర్‌షిప్(454) నమోదు చేసిన ఆటగాళ్లుగా నిలిచారు. 1934లో బ్రాడ్‌మన్&పోన్స్‌ఫోర్డ్(AUS) ఇంగ్లండ్‌పై 451 స్కోర్ చేయగా, 90 ఏళ్లకు ఆ రికార్డును బ్రూక్&రూట్ బద్దలుకొట్టారు. 3,4,5 స్థానాల్లో అటపట్టు&సంగక్కర 438(vsZIM), జయవర్దనే&సమరవీర 437(vsPAK), డిప్పెనార్&రుడాల్ఫ్(vsBAN) ఉన్నారు.

News October 10, 2024

రూ.500 కోట్ల విరాళాలు ఏం చేశారు?: అవినాశ్

image

AP: వరద బాధితులందరికీ తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలంటూ NTR(D) YCP అధ్యక్షుడు దేవినేని అవినాశ్ ఆధ్వర్యంలో VJAలో నిరాహార దీక్ష చేపట్టారు. చంద్రబాబు వల్లే బుడమేరు వరదలు వచ్చాయని అవినాశ్ ఆరోపించారు. కలెక్టరేట్ వద్ద పరిహారం కోసం బాధితులు పడిగాపులు కాస్తున్నారన్నారు. రూ.500 కోట్ల విరాళాలు ఏం చేశారని ప్రశ్నించారు. తమకు కావాల్సిన వారికే కూటమి నేతలు పరిహారం ఇచ్చారని, అర్హులను గాలికొదిలేశారని మండిపడ్డారు.