News August 7, 2024

More 31 Days: హైదరాబాద్‌లో బిగ్గెస్ట్ ఫెస్టివల్‌

image

మరో బిగ్గెస్ట్ ఫెస్టివల్‌కు హైదరాబాద్‌ సిద్ధమవుతోంది. వినాయకచవితి‌ వేడుకల‌ నిర్వహణ‌కు భాగ్యనగర్‌ ఉత్సవ సమితి, ఇతర అసోసియేషన్‌ సభ్యులు‌ ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే ధూల్‌పేటలో భారీ గణనాథుల బుకింగ్స్‌ మొదలయ్యాయి. మండపాల నిర్వహకులు బ్యాండ్‌ షాప్‌‌ల వైపు‌ పరుగులు తీస్తున్నారు. నాగోల్, హయత్‌నగర్‌లోనూ విభిన్న రకాల గణనాథులు కొలువుదీరారు. నవరాత్రులకు మరో 31 రోజులే సమయం ఉంది.

Similar News

News December 2, 2025

HYD: తెల్లాపూర్ భూములపై రియల్ కన్ను..!

image

కోకాపేట భూముల వేలం ప్రభావం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలపై పడింది. ఇక్కడ ఉండే భూములపై రియల్ నిపుణులు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ బహుళ అంతస్తుల నిర్మాణానికి ప్రణాళికలు చేస్తున్నారు. దీంతో స్థానికంగా భూముల ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో స్థానికంగా భూయజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మధ్యతరగతి ప్రజలకు ఈ భూములు అందుబాటులో ఉండకపోవడంతో వారు ఆందోళన చెందాల్సి వస్తుంది.

News December 2, 2025

HYD: తెల్లాపూర్ భూములపై రియల్ కన్ను..!

image

కోకాపేట భూముల వేలం ప్రభావం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలపై పడింది. ఇక్కడ ఉండే భూములపై రియల్ నిపుణులు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ బహుళ అంతస్తుల నిర్మాణానికి ప్రణాళికలు చేస్తున్నారు. దీంతో స్థానికంగా భూముల ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో స్థానికంగా భూయజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మధ్యతరగతి ప్రజలకు ఈ భూములు అందుబాటులో ఉండకపోవడంతో వారు ఆందోళన చెందాల్సి వస్తుంది.

News December 2, 2025

HYD: ప్రముఖ హోటళ్లపై కొనసాగుతున్న ఐటీ సోదాలు

image

హైదరాబాద్‌లో ప్రముఖ హోటళ్ళపై ఐటీ శాఖ దాడుల పరంపర కొనసాగుతోంది. వుడ్‌బ్రిడ్జ్ హోటల్ యజమాని హర్షద్ అలీ ఖాన్ను ఐటీ అధికారులు విచారించారు. పిస్తా హౌస్, షాగోస్, మేఫిల్ వంటి హోటళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీరి ఆర్థిక లావాదేవీలపై, ఇతర హోటళ్లతో ఉన్న సంబంధాలపై ఐటీ శాఖ దృష్టి సారించి పరిశీలన జరుపుతోంది.