News August 6, 2024
APలో మరిన్ని ఎయిర్పోర్టులు: చంద్రబాబు

APలో నెల్లూరు(D) దగదర్తి, చిత్తూరు(D) కుప్పం, పల్నాడు(D) నాగార్జునసాగర్లలో ఎయిర్పోర్టులు/ఎయిర్స్ట్రిప్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు CM చంద్రబాబు సూచించారు. భూసేకరణ కూడా పూర్తైన ఈ ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. తాడిపత్రి, తునిలోనూ ఎయిర్పోర్టులు నిర్మించే అంశాన్ని పరిశీలించాలని CM కోరారు. కర్నూలు ఎయిర్పోర్టులో ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ వంటివి తీసుకురావాలన్నారు.
Similar News
News November 24, 2025
వాట్సాప్ హ్యాక్.. ఇలా చేయండి!

TG మంత్రులు, కొంతమంది ప్రజల <<18366823>>వాట్సాప్ గ్రూపులు<<>>, అకౌంట్లు హ్యాకవడంతో సైబర్ క్రైమ్ అధికారులు జాగ్రత్తలు సూచించారు. ‘వెంటనే www.whatsapp.com/contactలో, 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. యాప్ అన్ఇన్స్టాల్ చేసి మళ్లీ ఇన్స్టాల్ చేసుకోవాలి. 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయాలి. ఫోన్ ఓవర్ హీట్, బ్యాటరీ త్వరగా డిశ్చార్జ్ అవుతుంటే ఫోన్ హ్యాక్ అయినట్లే. వెంటనే ఫోన్ను రీసెట్ చేయాలి’ అని సూచిస్తున్నారు.
News November 24, 2025
జమ్మూ టూరిజంపై ఢిల్లీ బ్లాస్ట్ ఎఫెక్ట్!

పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జమ్మూ టూరిజాన్ని ఢిల్లీ బ్లాస్ట్ మరోసారి ఇబ్బందుల్లోకి నెట్టింది. వింటర్ సీజన్ కావడంతో టూరిజం కార్యకలాపాలపై CM ఒమర్ అబ్దుల్లా సహా ట్రావెల్ ఏజెంట్లూ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇటీవల జరిగిన ఢిల్లీ బాంబుదాడితో టూరిస్టుల్లోనూ భయం నెలకొంది. పైగా దాడిలో కశ్మీర్ మూలాలున్న ఇద్దరిని NIA అరెస్టు చేసింది. ఇది మరోసారి జమ్మూ టూరిజంపై ఎఫెక్ట్ పడేలా చేసింది.
News November 24, 2025
AAIలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)లో 20గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఇంజినీరింగ్ డిగ్రీ, డిగ్రీ (B.Com, BA, BSc, BBA), డిప్లొమా ఉత్తీర్ణులు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు నెలకు రూ.15వేలు, డిప్లొమా అప్రెంటిస్లకు రూ.12వేలు చెల్లిస్తారు. అభ్యర్థులు NATS పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలి. వెబ్సైట్: aai.aero.


