News August 6, 2024

APలో మరిన్ని ఎయిర్‌పోర్టులు: చంద్రబాబు

image

APలో నెల్లూరు(D) దగదర్తి, చిత్తూరు(D) కుప్పం, పల్నాడు(D) నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు/ఎయిర్‌స్ట్రిప్‌ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు CM చంద్రబాబు సూచించారు. భూసేకరణ కూడా పూర్తైన ఈ ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. తాడిపత్రి, తునిలోనూ ఎయిర్‌పోర్టులు నిర్మించే అంశాన్ని పరిశీలించాలని CM కోరారు. కర్నూలు ఎయిర్‌పోర్టులో ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ వంటివి తీసుకురావాలన్నారు.

Similar News

News December 1, 2025

తిరుపతి: రేపు పాఠశాలలకు సెలవు లేదు: డీఈవో

image

తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్య పాఠశాలలు మంగళవారం యథావిధిగా కొనసాగుతాయని డీఈవో కుమార్ తెలిపారు. దిత్వా తుఫాను ప్రభావం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఎలాంటి సెలవు లేదని స్పష్టం చేశారు. ఎంఈవోలు, డీవైఈవోలు విద్యార్థులకు సమాచారం అందించి పాఠశాలలు పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు.

News December 1, 2025

ఢిల్లీకి మంత్రి లోకేశ్.. రేపు కేంద్ర మంత్రులతో భేటీ

image

AP: మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీ వెళ్లారు. వారికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు స్వాగతం పలికారు. రేపు పార్లమెంట్‌లో కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్‌తో లోకేశ్, అనిత భేటీ కానున్నారు. మొంథా తుఫాను ప్రభావం వల్ల జరిగిన నష్టం అంచనా రిపోర్టును వారికి అందిస్తారు.

News December 1, 2025

దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ కన్నుమూత

image

ఇటలీకి చెందిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్, రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత నికోలా పియట్రాంగెలీ(92) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇటలీ టెన్నిస్ ఫెడరేషన్ ధ్రువీకరించింది. ప్రపంచ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇటలీ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక ప్లేయర్ నికోలానే కావడం విశేషం. తన కెరీర్‌లో 44 సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు. ఆయన తండ్రి ఇటలీకి చెందిన వ్యక్తి కాగా తల్లి రష్యన్. నికోలా 1933లో జన్మించారు.