News August 11, 2024

ఏపీలో మరిన్ని ఎయిర్‌పోర్టులు: రామ్మోహన్

image

AP: దగదర్తి(నెల్లూరు), కుప్పం, నాగార్జునసాగర్ వద్ద ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ఆలోచిస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ‘ఈ ప్రాజెక్టుకు ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే శక్తి ఉంది. గత నెల నుంచి ఇప్పటివరకు పనుల్లో 4% పురోగతి ఉంది. మొత్తం ఇప్పటివరకు 36% పనులు పూర్తయ్యాయి. గడువు కంటే ముందే నిర్మాణం పూర్తి చేస్తాం’ అని ఆయన వెల్లడించారు.

Similar News

News December 4, 2025

మామిడిలో జింకు లోపం – లక్షణాలు

image

సాధారణంగా చౌడు నేలల్లోని మామిడి తోటల్లో జింకు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. జింకు లోపమున్న నేలల్లో మొక్కల పెరుగుదల క్షీణించి పాలిపోయి చనిపోతాయి. పెరుగుదల దశలో జింకు లోపముంటే ఆకులు చిన్నవిగా మారి సన్నబడి పైకి లేదా కిందకు ముడుచుకుపోతాయి. కణుపుల మధ్య దూరం తగ్గిపోయి, ఆకులు గులాబీ రేకుల వలే గుబురుగా తయారవుతాయి. మొక్కల పెరుగుదల క్షీణించి కాయల పెరుగుదల, నాణ్యత మరియు దిగుబడి తగ్గిపోతుంది.

News December 4, 2025

భారీ జీతంతో ఉద్యోగాలు

image

తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (<>THDC<<>>)లో 40 అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BSc(ఇంజినీరింగ్), బీటెక్, BE, MBBS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.600. SC, ST, PWBDలకు ఫీజు లేదు. స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.55వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: thdc.co.in

News December 4, 2025

తల్లిపై కూతురు పోటీ.. విషాదాంతం

image

TG: రాజకీయాలు కుటుంబ సంబంధాలనూ విచ్ఛిన్నం చేస్తున్నాయి. నల్గొండ(D) ఏపూరులో తల్లీకూతురు మధ్య నెలకొన్న రాజకీయ వివాదం విషాదాంతమైంది. 3వ వార్డు అభ్యర్థులుగా తల్లి లక్ష్మమ్మను BRS, ఆమె కూతురు అశ్వినిని కాంగ్రెస్ బలపరిచింది. ఈ క్రమంలో కూతురు నామినేషన్ ఉపసంహరించుకున్నప్పటికీ ఫ్యామిలీ గొడవలు తారస్థాయికి చేరాయి. దీంతో లక్ష్మమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.