News September 4, 2025
AP క్యాబినెట్ మరిన్ని నిర్ణయాలు

క్యాబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి వివరించారు.
* 2025 ఆగస్టు 31 వరకు ఉన్న అనధికార కట్టడాల క్రమబద్ధీకరణకు నిర్ణయం
* చిత్తూరు జిల్లాలో 2 పరిశ్రమల ఏర్పాటుకు సమ్మతం
* మడకశిరలో HFCL కంపెనీ ఏర్పాటుకు ఆమోదం
* విశాఖ, అమరావతి, మంత్రాలయంలో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు పచ్చజెండా
* పట్టణాల్లో 2సెంట్లు, గ్రామాల్లో 3సెంట్ల ఇంటి స్థలం ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం
Similar News
News September 5, 2025
నేటి ముఖ్యాంశాలు

* వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్దాం: మోదీ
* APలోని పౌరులందరికీ ఉచిత ఆరోగ్య బీమా.. క్యాబినెట్ నిర్ణయం
* SLBC పనులు 2027 డిసెంబర్ 9లోగా పూర్తి చేయాలి: సీఎం రేవంత్
* రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చించాం: భట్టి
* కలుషిత నీటితోనే తురకపాలెంలో మరణాలు: అంబటి
* భార్గవ్పై ఆరోపణలు అవాస్తవం: సజ్జల రామకృష్ణారెడ్డి
* హైదరాబాద్లో గణేశ్ లడ్డూకు రూ.51 లక్షల రికార్డు ధర
News September 5, 2025
రేపు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోనున్న సీఎం

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఖైరతాబాద్ వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు మహాగణపతిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆయన వెంట పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్, మంత్రులు పొన్నం, సురేఖ కూడా వెళ్తారు. కాగా శనివారం మహాగణపతిని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయనున్నారు. దీంతో ముందస్తు ఏర్పాట్ల నిమిత్తం ఇవాళ రాత్రి 12 గంటల నుంచే భక్తుల దర్శనాలను నిలిపివేయనున్నారు.
News September 5, 2025
నేపాల్లో సోషల్ మీడియా యాప్స్పై బ్యాన్

నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, X, రెడిట్, లింక్డ్ఇన్ వంటి సోషల్ మీడియా యాప్స్ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఇవాళ రాత్రి నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఐటీ చట్టాల నిబంధనలను పాటించడంతో విఫలం కావడమే నిషేధానికి కారణమని వెల్లడించింది. అయితే దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.