News September 17, 2024
పుష్ప-2 కంటే ‘దేవర’పైనే ఎక్కువ ఇంట్రస్ట్!

బుక్ మై షోలో ఇంట్రస్ట్ల విషయంలో పుష్ప-2ను ‘దేవర’ దాటేసింది. పుష్ప-2ను చూసేందుకు 334.6K మంది ఆసక్తి చూపిస్తుండగా, దేవర పార్ట్-1ను చూడటానికి ఆసక్తిగా ఉన్న వారి సంఖ్య 341.3Kకి పెరిగింది. దీంతో పుష్ప-2ను దేవర పార్ట్-1 అధిగమించింది. ఈనెల 27న దేవర విడుదలవుతుండగా, DEC 6న పుష్ప-2 రిలీజ్ కానుంది. అప్పటివరకు పుష్ప-2 చూడటానికి ఎక్కువ మంది ఇంట్రస్ట్ చూపుతారని అల్లుఅర్జున్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News December 20, 2025
భారీగా పెరిగిన వెండి ధర!

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి ధరలు భారీగా పెరగ్గా గోల్డ్ రేట్స్ తటస్థంగా ఉన్నాయి. కేజీ సిల్వర్పై ఏకంగా రూ.5,000 పెరిగి జీవితకాల గరిష్ఠానికి చేరింది. ప్రస్తుతం KG వెండి రేటు రూ.2,26,000గా ఉంది. అటు 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,34,180, 22క్యారెట్ల 10gmల గోల్డ్ రేటు రూ.1,23,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 20, 2025
స్పైస్జెట్ ప్యాసింజర్పై ఎయిర్ ఇండియా పైలట్ దాడి!

ఢిల్లీ ఎయిర్పోర్టులో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (AIX) పైలట్ ఒకరు తనపై దాడి చేశారని స్పైస్జెట్ ప్యాసింజర్ అంకిత్ దేవాన్ ఆరోపించారు. క్యూ లైన్ దాటుకొని వెళ్లడాన్ని ప్రశ్నించడంతో ఆగ్రహించిన పైలట్ తన ముఖంపై రక్తం వచ్చేలా కొట్టాడని Xలో పోస్ట్ చేశాడు. గాయాలకు సంబంధించిన ఫొటోను కూడా జత చేశాడు. ఘటన సమయంలో పైలట్ విధుల్లో లేనప్పటికీ.. అతణ్ని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించినట్లు AIX తెలిపింది.
News December 20, 2025
మలయాళ నటుడు శ్రీనివాసన్ మృతి

ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు, స్క్రీన్ప్లే రైటర్ శ్రీనివాసన్(69) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎర్నాకుళంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కన్నూరు జిల్లాలోని పట్టియంలో 1956లో జన్మించిన శ్రీనివాసన్ 48 ఏళ్ల సినీ కెరీర్లో కామెడీ పాత్రలతో అలరించారు. సందేశాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించి ఆలోచింపజేశారు. శ్రీనివాసన్ మృతి పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు సంతాపం తెలిపారు.


