News December 5, 2024
వ్యవసాయదారులకు మరిన్ని రుణాలు: నాబార్డ్

AP: రాష్ట్రంలో వ్యవసాయానికి మరిన్ని రుణాలు అందించేందుకు తమ సహకారం ఉంటుందని నాబార్డు ఛైర్మన్ షాజీ కృష్ణన్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అమరావతిలో CM చంద్రబాబుతో కృష్ణన్ సమావేశమయ్యారు. ‘డ్వాక్రా గ్రూపులు, రైతులను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ప్రయత్నిస్తాం. రాష్ట్రానికి FIDF కింద అదనపు నిధులు, కేటాయింపులు, రాయితీలు అందిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 18, 2026
4 రోజుల్లో ₹14,266 కోట్లు ఔట్

భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు (FPIs) గతవారం ఏకంగా ₹14,266 కోట్లు వెనక్కి తీసుకున్నారు. కేవలం 4 ట్రేడింగ్ సెషన్లలోనే ఈ భారీ అమ్మకాలు జరిగాయి. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, సుంకాల భయాల నేపథ్యంలో విదేశీ సంస్థలు తమ పెట్టుబడులను విత్డ్రా చేసుకుంటున్నాయి. అయితే దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DIIs) ₹16,174 కోట్లు పంప్ చేయడంతో మార్కెట్లు స్థిరంగా నిలబడగలిగాయి.
News January 18, 2026
చేపల పెంపకం.. ‘బయో సెక్యూరిటీ’తో అదనపు లాభం

‘బయో సెక్యూరిటీ’తో చేపల పెంపకంలో అదనపు లాభాలుంటాయి. సాధారణంగా మేతకు వచ్చే పశువులు చేపల చెరువులో నీటిని తాగడానికి వస్తుంటాయి. పాములు, పక్షులు కూడా చేపలను తినడానికి వస్తుంటాయి. వీటి నుంచి చేపలకు రక్షణ కోసం బయో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటే మంచిది. దీనికోసం చేపల చెరువు చుట్టూ గ్రీన్ క్లాత్, వల లేదా ఓ ఇనుప కంచెను ఏర్పాటు చేసుకోవాలి. ప్రకృతి విపత్తుల్లో కూడా దీని వల్ల చేపలకు తక్కువ నష్టం జరుగుతుంది.
News January 18, 2026
2027 సంక్రాంతికి లైన్లో చిరు, రజినీకాంత్!

2027 సంక్రాంతి సినిమాలపై చర్చ అప్పుడే మొదలైంది. ‘MSVPG’తో హిట్ అందుకున్న చిరంజీవి వచ్చే సంక్రాంతికి మరో సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. యంగ్ హీరో తేజా సజ్జ ‘జాంబిరెడ్డి 2’తో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో యాక్షన్, కామెడీ జానర్ సినిమాతో శర్వానంద్, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్తో అనిల్ రావిపూడి, కొత్త సినిమాతో రజినీకాంత్ సంక్రాంతి బాక్సాఫీస్పై కన్నేశారు.


