News December 5, 2024

వ్యవసాయదారులకు మరిన్ని రుణాలు: నాబార్డ్

image

AP: రాష్ట్రంలో వ్యవసాయానికి మరిన్ని రుణాలు అందించేందుకు తమ సహకారం ఉంటుందని నాబార్డు ఛైర్మన్ షాజీ కృష్ణన్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అమరావతిలో CM చంద్రబాబుతో కృష్ణన్ సమావేశమయ్యారు. ‘డ్వాక్రా గ్రూపులు, రైతులను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ప్రయత్నిస్తాం. రాష్ట్రానికి FIDF కింద అదనపు నిధులు, కేటాయింపులు, రాయితీలు అందిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News September 16, 2025

రేబిస్‌తో చిన్నారి మృతి

image

AP: గుంటూరు(D) పొన్నూరు (M) వెల్లటూరులో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన తాడిశెట్టి కార్తీక్(5) ఇంటి వద్ద ఆడుకుంటుండగా గత నెల 22న కుక్కలు దాడి చేశాయి. గాయపడిన బాలుడిని పలు ఆస్పత్రుల్లో చూపించారు. 3రోజుల కిందట ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో విజయవాడలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా రేబిస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స కోసం GNT ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయాడు.

News September 16, 2025

షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు: BCCI

image

పాక్ క్రికెటర్లకు భారత ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై <<17723523>>వివాదం<<>> తలెత్తిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై BCCI సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. ‘ప్రత్యర్థులతో షేక్ హ్యాండ్‌కు సంబంధించి రూల్ బుక్‌లో ఎలాంటి స్పెసిఫికేషన్ లేదు. అది ఒక గుడ్‌విల్ జెశ్చర్ మాత్రమే. చట్టం కాదు. అలాంటి రూల్ లేనప్పుడు సత్సంబంధాలు లేని ప్రత్యర్థికి టీమ్ ఇండియా షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు.

News September 16, 2025

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.146.3 కోట్లు రిలీజ్

image

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైన తర్వాత నుంచి ఇప్పటివరకు రూ.1,435 కోట్లు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. నిన్న 13,841 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.146.30 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 2.15 లక్షల ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. 1.29 లక్షల ఇళ్లు పురోగతిలో ఉన్నాయన్నారు.