News November 23, 2024
పురుగుల మందు పీల్చి 100కి పైగా కోతుల మృతి

UPలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ ఆహార నిల్వల గోడౌన్లో పురుగుల మందు స్ప్రే చేయగా కిటికీ నుంచి లోపలికి వెళ్లిన 100కి పైగా కోతులు దాన్ని పీల్చడం వల్ల చనిపోయాయి. గోడౌన్ నిర్వాహకులు గుట్టుగా వాటన్నింటినీ ఓ గోతిలో ఖననం చేశారు. స్థానిక విశ్వహిందూ పరిషత్ నేతలు పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కోతుల్ని వెలికి తీశామని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Similar News
News December 20, 2025
నాయకులారా? ఈ సమస్య మీకు కనిపించట్లేదా?

అమ్మాయిలు, మహిళలు బయటకు వెళ్తే గుక్కెడు నీళ్లు తాగేందుకూ భయపడతారు. ఎక్కడ యూరిన్ వస్తుందేమోనని వాళ్ల భయం. ఎందుకంటే మన దేశంలో సరిపడా టాయిలెట్స్ ఉండవు. ఉన్నా క్లీన్గా ఉండవు. దీంతో అతివలు గంటల కొద్దీ బిగపట్టుకుని కూర్చుంటున్నారు. ఫలితంగా అనారోగ్యం బారిన పడి <<18616284>>ప్రాణాల<<>> మీదకు తెచ్చుకుంటున్నారు. ఇంతపెద్ద సమస్య మన నాయకులకు ఇప్పటికీ చిన్నగానే కనిపిస్తుంది. ఇప్పుడైనా మారతారేమో చూద్దాం.
News December 20, 2025
28కేసులపై 23న ప్రివిలేజ్ కమిటీ విచారణ

AP: శాసనసభ ప్రివిలేజ్ కమిటీ ఈనెల 23న సమావేశం నిర్వహించనుంది. రాష్ట్రంలో తమ హక్కులకు భంగం కలిగిన ఘటనలపై శాసనసభ్యులు అందించిన ఫిర్యాదులతో పాటు సభ నుంచి అందిన ప్రతిపాదనలపై కమిటీ విచారించనుంది. వీటికి సంబంధించి బాధ్యులైన అధికారులను సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు అందించినట్లు కమిటీ అధ్యక్షుడు బి.టి.నాయుడు పేర్కొన్నారు. 28 కేసులపై చర్చించనున్నట్లు తెలిపారు.
News December 20, 2025
Money Tip: తొందరొద్దు.. 48 గంటలు ఆగండి!

పెద్దగా ఆలోచించకుండా ఏదైనా వస్తువు కొనడాన్ని Impulsive Buying అంటారు. దీనివల్ల అనవసరమైన వాటిని కొని దీర్ఘకాలంలో ₹లక్షల్లో నష్టపోతాం. దీనికి పరిష్కారమే 48 గంటల రూల్. ఏదైనా కొనాలనిపిస్తే వెంటనే ఆర్డర్ చేయకుండా 2 రోజులు ఆగాలి. ఆ గ్యాప్లో ఆ వస్తువు అవసరమా కాదా మీకే అర్థమవుతుంది. ఇలా ఖర్చులు తగ్గించి ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో భారీ మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.


